Budget 2023: బడ్జెట్లో గ్రీన్ గ్రోత్: ఆరోగ్యం, అభివృద్ధికి.. ‘హరిత’ అమృతం..!
Green Growth: ఈసారి బడ్జెట్లో కేంద్రం పర్యావరణ హితమైన చొరవను చూపింది. గ్రీన్ గ్రోత్ సాధించే దిశగా పలు చర్యలను ప్రకటించింది.
దిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో వాతావరణ మార్పులే అతిపెద్ద సమస్య కాబోతున్నాయని అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ.. భారత ప్రభుత్వం తన బడ్జెట్లో గ్రీన్ గ్రోత్ (హరితవృద్ధి)కి (Green Growth) పెద్ద పీట వేసింది. 2070కి శూన్య ఉద్గారాలకు చేరాలని విధించుకున్న లక్ష్యాన్ని సాధించేదిశగా చొరవ చూపింది. పర్యావరణ హితమైన దిశగా చర్యలు ప్రకటించింది. సప్తర్షి రీతిన మన బడ్జెట్ (Budget 2023) అంటూ ప్రకటించిన ఏడు ప్రాధాన్యాంశాల్లో ఈ గ్రీన్ గ్రోత్ కూడా ఒకటి.
* గ్రీన్ హైడ్రోజన్: ఇటీవల ప్రారంభించిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం ఈ బడ్జెట్లో రూ.19,700 కోట్లు కేటాయించారు. ఆర్థిక వ్యవస్థను కర్బన రహితంగా మార్చేందుకు, శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఈ మిషన్ సహకరిస్తుందని మంత్రి చెప్పారు. ఈ మిషన్ కింద 2030 నాటికి ఏడాదికి 500 మిలియన్ల మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం.
* ఇంధన పరివర్తన, శూన్య ఉద్గారాల లక్ష్యాల సాధన, ఇంధన భద్రత కోసం మూలధన పెట్టుబడి కింద ఈ బడ్జెట్లో రూ.35వేల కోట్ల కేటాయింపులు చేపట్టారు.
* అలాగే 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ నిల్వల వ్యవస్థ కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(VGF)ను ప్రకటించింది. VGF అంటే.. ఏదైనా ప్రాజెక్టు ఆర్థికంగా భారంగా మారకుండా ఉండేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే గ్రాంట్ లేక సబ్సిడీ లేక వాటాలు.
* పునరుత్పాదక ఇంధన తరలింపు, గ్రిడ్ ఇంటిగ్రేషన్ కోసం అంతరాష్ట్ర ప్రసార వ్యవస్థను నిర్మించేందుకు రూ.20,700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. అందులో కేంద్రం సాయం రూ.8,300 కోట్లు. ఈ గ్రిడ్ను లద్దాఖ్లో నిర్మించతలపెట్టారు.
* గ్రీన్ క్రెడిట్ ప్రొగ్రాం: ప్రకృతి విషయంలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించేందుకు గ్రీన్ క్రెడిట్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రకటించింది. సంస్థలు, వ్యక్తులు, స్థానిక సంస్థల పర్యావరణ హితమైన చర్యలను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. పర్యావరణ స్థిరత్వం కోసం పాటుపడేవారికి అదనపు వనరులు సమీకరించడంలో సహకరిస్తామన్నారు.
* మన ఆర్థిక వ్యవస్థను పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు పాత కాలుష్య వాహనాలను వదిలించుకోవాల్సి ఉందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా 2021-22 బడ్జెట్లో ప్రకటించిన వాహనాల తుక్కు విధానం గురించి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు నిధులు కేటాయించారు. రాష్ట్రాలకు ఈ అంశంలో సహకారం అందిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు