Moonlighting: మూన్లైటింగ్ చేస్తున్నారా? పన్నులు తప్పవు మరి!
మూన్లైటింగ్ చేస్తూ పొందే అదనపు ఆదాయం కూడా పన్ను పరిధిలోకి వస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కంపెనీకి తెలియకుండా చేసినా.. ఆదాయ పన్ను విభాగానికి మాత్రం వివరాలు తెలియకుండా ఉండవని చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అదనపు ఆదాయం కోసం ఐటీ రంగంలో కొంతమంది నిపుణులు మూన్లైటింగ్ (Moonlighting) చేస్తున్నారు. అంటే ఒక ప్రధాన ఉద్యోగంతో పాటు ఖాళీ సమయాల్లో మరో సంస్థకు ప్రాజెక్టులు చేసిపెడుతున్నారు. ఇలా చేస్తున్నవారు పన్ను (Income Tax) చెల్లించడానికి సిద్ధంగా ఉండాలంటున్నారు ఆర్థిక నిపుణులు.
అదనపు ఆదాయాన్ని కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నుల్లో (ITR) చూపించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఐటీ నోటీసులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఫ్రీలాన్సింగ్, కన్సల్టెన్సీ, కాంట్రాక్ట్.. ఇలా ఎలాంటి ఉద్యోగమైనప్పటికీ అది ఆదాయ పన్ను (Income Tax) విభాగానికి తెలియకుండా ఉండదని చెబుతున్నారు. మూన్లైటర్లకు కంపెనీలు వేతనం లేదా ప్రొఫెషనల్ ఫీజు రూపంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండూ ఆదాయ పన్ను (Income Tax) రికార్డుల్లో నమోదవుతాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 194సీ ప్రకారం.. రూ.30 వేల కంటే ఎక్కువ చెల్లించే కంపెనీలకు నిర్దేశిత రేటు వద్ద ‘మూలం వద్ద పన్ను (TDS)’ వర్తిస్తుంది. లేదా ఒక ఏడాదిలో చెల్లించే మొత్తం రూ.1 లక్ష దాటినా టీడీఎస్ (TDS) కట్ అవుతుంది. లేదా జీఎస్టీ కింద ‘ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)’ క్లెయిం కోసమైనా కంపెనీలు దరఖాస్తు చేసుకుంటాయి. ఈ రెండు సందర్భాల్లో ఆ లావాదేవీలు ఐటీ రికార్డుల్లో నమోదవుతాయి. మరోవైపు ప్రతి కంపెనీ తమ చెల్లింపుల వివరాలను డిసెంబరు లేదా జనవరిలో కచ్చితంగా ఐటీ విభాగానికి సమర్పిస్తాయి. కాబట్టి మూన్లైటర్లు పొందే ఆదాయాన్ని దాచిపెట్టేందుకు ఎక్కడా ఆస్కారం ఉండదు.
ఒకసారి కంపెనీలు తమ చెల్లింపులను టీడీఎస్ (TDS) లేదా ఐటీసీ కింద రికార్డు చేశాయంటే.. ఆ మొత్తం పొందినవారి 26ఏఎస్ ఫారంలో ఆ లావాదేవీ వివరాలన్నీ కనపడతాయి. ఈ నేపథ్యంలో మూన్లైటర్లు పొందుతున్న అదనపు ఆదాయాన్ని దాయడానికి అవకాశం ఉండదని నిపుణులు వివరిస్తున్నారు. ఉద్యోగులు కంపెనీ నుంచి ఫారం 16ను పొందాల్సి ఉంటుంది. ఇందులో వేతనం ద్వారా వచ్చిన ఆదాయం, దానిపై టీడీఎస్కు సంబంధించిన వివరాలు ఉంటాయి. అయితే, ఉద్యోగి అదనపు పనిచేయడం ద్వారా పొందుతున్న ఆదాయం గురించి సంస్థకు తెలిసే అవకాశం లేదు. ఫారం 26ఏఎస్ చూస్తేగానీ ఆ విషయం వారికి తెలియదు. కాబట్టి కంపెనీకి దొరక్కుండా మూన్లైటింగ్ (Moonlighting) చేసినప్పటికీ.. పన్ను విభాగం నుంచి తప్పించుకోవడం మాత్రం కుదరదు.
సాధారణంగా ఐటీఆర్లో ఉద్యోగులు తమ ఆదాయాన్ని వేతనం, లాభాలు.. అనే రెండు కేటగిరీల కంద చూపించాల్సి ఉంటుంది. వేతనం కింద ప్రధాన కంపెనీ నుంచి పొందుతున్న ఆదాయాన్ని చూపించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరో ఉద్యోగం ద్వారా పొందుతున్న ఆర్జనను ఖర్చులన్నీ తీసేసి లాభాల కింద చూపించాలని సలహా ఇస్తున్నారు. అంటే మీరు చేస్తున్న ఉద్యోగానికి అయ్యే ప్రతి ఖర్చును తీసేసి మిగిలిన మొత్తాన్ని ప్రొఫెషన్ ద్వారా పొందుతున్న లాభాల కింద పేర్కొనాలన్నమాట! ఒకవేళ ఇలా పొందుతున్న అదనపు ఆదాయం మొత్తం ఒక ఏడాదిలో రూ.20 లక్షలు దాటితే దానిపై జీఎస్టీ కూడా కట్టాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
Best Airports: స్కైట్రాక్స్ ఏటా ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంటుంది. వీటిలో తొలి 20 స్థానాల్లో ఏవి నిలిచాయి? భారత్లోని ఎయిర్పోర్టుల పరిస్థితి ఏంటో చూద్దాం.. -
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు