Cryptocurrency: భారత్లో 7శాతం మంది దగ్గర క్రిప్టోకరెన్సీ
భారత్లో దాదాపు ఏడు శాతం మంది దగ్గర డిజిటల్ కరెన్సీ ఉందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది....
ఐరాస నివేదిక
ఐరాస: భారత్లో 2021 నాటికి దాదాపు ఏడు శాతం మంది దగ్గర డిజిటల్ కరెన్సీ ఉందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో వెల్లడించింది. కొవిడ్-19 సమయంలో క్రిప్టోకరెన్సీ (cryptocurrency) వినియోగం గణనీయంగా పెరిగినట్లు తెలిపింది. జనాభాపరంగా అత్యధిక మంది క్రిప్టోకరెన్సీ (cryptocurrency)లు కలిగిన తొలి 20 దేశాల జాబితాలో 15 అభివృద్ధి చెందుతున్న దేశాలేనని ‘యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (UNCTAD)’ పేర్కొంది.
ఈ జాబితాలో ఉక్రెయిన్ తొలిస్థానంలో నిలిచింది. ఆ దేశ జనాభాలో దాదాపు 12.7 శాతం మంది వద్ద క్రిప్టోకరెన్సీ (cryptocurrency) ఉందని నివేదిక తెలిపింది. రష్యా (11.9 శాతం), వెనిజువెలా (10.3 శాతం), సింగపూర్ (9.4 శాతం), కెన్యా (8.5 శాతం), అమెరికా (8.3 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచిన భారత్లో దాదాపు 7.3 శాతం మంది క్రిప్టోకరెన్సీని కలిగి ఉన్నారని యూఎన్సీటీఏడీ పేర్కొంది.
ఈ ప్రైవేటు డిజిటల్ కరెన్సీల వల్ల కొందరు భారీగా లాభపడ్డట్లు ఐరాస నివేదిక తెలిపింది. అదే సమయంలో నగదు బదిలీ సాధనంగా కూడా ఉపయోగపడ్డట్లు పేర్కొంది. అలాగే ద్రవ్యోల్బణ ముప్పును అధిగమించే స్థాయిలో రాబడినిస్తుందని మదుపర్లు భావించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్రిప్టోకరెన్సీలకు ఆదరణ లభించినట్లు వివరించింది.
కానీ, ఈ అస్థిర ఆర్థిక సాధనం వల్ల సామాజిక, ఆర్థిక దుష్ప్రభవాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఒకవేళ క్రిప్టోను చెల్లింపుల మాధ్యమం కింద విస్తృతంగా వినియోగిస్తే.. అది దేశాల ఆర్థిక సౌరభౌమత్వానికే ప్రమాదమని తెలిపింది. ఆర్థిక వ్యవస్థలు అస్థిరంగా మారతాయని పేర్కొంది. ఒకవేళ వీటి నియంత్రణకు కేంద్ర బ్యాంకులు గనక నేరుగా రంగంలోకి దిగితే.. పరిస్థితి మరింత జటిలమై ప్రజాసమస్యగా మారుతుందని హెచ్చరించింది.
క్రిప్టోలు నగదు బదిలీకి అనువుగా ఉన్నప్పటికీ.. దీనివల్ల పన్ను ఎగవేత వంటి సమస్యలు తలెత్తుతాయని ఐరాస తెలిపింది. దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ఆదాయ మార్గాలు కుచించుకుపోయి ప్రమాదం తలెత్తక తప్పదని పేర్కొంది. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీల విస్తరణను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది. దీనికోసం క్రిప్టో కరెన్సీలు, ఎక్స్ఛేంజీలు, డిజిటల్ వ్యాలెట్ల నియంత్రణకు సమగ్ర చట్టాలను రూపొందించాలని కోరింది. అలాగే చట్టబద్ధ సంస్థలు క్రిప్టోకరెన్సీల కొనుగోలు నుంచి దూరంగా ఉంచాలని హితవు పలికింది. ఈ డిజిటల్ కరెన్సీలకు సంబంధించిన ప్రకటనలను కూడా నియంత్రించాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్