FTA: ‘జీసీసీ’తో స్వేచ్ఛా వాణిజ్యంపై త్వరలో భారత్ చర్చలు
జీసీసీతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునే దిశగా కీలక ముందడుగు పడబోతోంది. త్వరలోనే ఆయా దేశాలతో చర్చలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
దిల్లీ: భారత్, ‘గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC)’ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. నవంబరు 24 నుంచి చర్చలు మొదలు కావొచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటికే జీసీసీ అధికారులు భారత్కు చేరుకున్నట్లు తెలిపారు. జీసీసీలో సౌదీ అరేబియా, యూఏఈ, కతార్, కువైట్, ఒమన్, బహ్రైన్.. మొత్తం ఆరు సభ్యదేశాలు ఉన్నాయి. భారత్ ఇప్పటికే ఈ ఏడాది మే నుంచి యూఏఈతో ఎఫ్టీఏను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. త్వరలోనే మరో ఎఫ్టీఏపై చర్చలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే జీసీసీతో 2006, 2008లో రెండు దఫాలు ఎఫ్టీఏపై చర్చలు జరిగాయి. కానీ, జీసీసీ తాత్కాలికంగా ఎఫ్టీఏలను నిలిపివేయాలని నిర్ణయించడంతో మళ్లీ చర్చలు జరగలేదు. గల్ఫ్ దేశాలైన సౌదీ, కతార్ నుంచి భారత్ ప్రధానంగా ముడి చమురు, సహజవాయువును దిగుమతి చేసుకుంటోంది. ఆయా దేశాలకు ముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, ఇమిటేషన్ నగలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, ఇనుము, ఉక్కు, రసాయనాలను ఎగుమతి చేస్తోంది. 2020-21లో జీసీసీకి భారత ఎగుమతుల విలువ 27.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2021-22 నాటికి అది 25.26 శాతం పెరిగి 44 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్షం. ఇదే సమయంలో మొత్తం భారత ఎగుమతుల్లో జీసీసీ వాటా 10.4 శాతం పెరిగింది. మరోవైపు దిగుమతుల విలువ 85.8 శాతం పెరిగి 110.73 బిలియన్ డాలర్లకు చేరింది. దేశ మొత్తం దిగుమతుల్లో ఈ ఆరు దేశాల వాటా 18 శాతానికి చేరింది. ద్వైపాక్షిక వాణిజ్యం 154.73 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
వాణిజ్యపరంగానే కాకుండా గల్ఫ్ దేశాలతో భారతీయులకు విడదీయరాని బంధం ఉంది. ఈ దేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా గణనీయంగా ఉంటుంది. 32 మిలియన్ల ప్రవాస భారతీయుల్లో సగానికి పైగా గల్ఫ్ దేశాల్లోనే పనిచేస్తున్నారు. వీరు పంపే డబ్బు మన విదేశీ మారక నిల్వలకు ప్రధాన వనరు. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం విదేశాల్లో ఉన్న భారతీయులు పంపిన డబ్బు విలువ 2021లో 87 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంట్లో జీసీసీ దేశాలది కీలక వాటా అని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి సౌదీ అరేబియా నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. యూఏఈ మూడు, కువైట్ 27వ స్థానంలో ఉన్నాయి. కతార్ నుంచి భారత్ ఏటా 8.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకుంటోంది. చిరుధాన్యాలు, చేపలు, రసాయనాలు, ప్లాస్టిక్స్ ఎగుమతి చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్