Indian Economy: కీలక ఆర్థిక పునరుద్ధరణ అంచున భారత్
భారత ఆర్థిక వ్యవస్థ కీలక పునరుద్ధరణ అంచున ఉందని నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఆదివారం తెలిపారు. గత ఏడేళ్లుగా ప్రభుత్వం అనేక సంస్కరణలతో బలమైన పునాదులు వేసిందని తెలిపారు...
నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్
దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ కీలక పునరుద్ధరణ అంచున ఉందని నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఆదివారం తెలిపారు. గత ఏడేళ్లుగా ప్రభుత్వం అనేక సంస్కరణలతో బలమైన పునాదులు వేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో ‘స్టాగ్ఫ్లేషన్’ సమస్య తలెత్తనుందనే చర్చకు ఆస్కారం లేదని అభిప్రాయపడ్డారు. 2022-23లో భారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మూలంగా తలెత్తిన సమస్యల నేపథ్యంలో వృద్ధిరేటును సమీక్షించాల్సిన అవసరం రావొచ్చన్నారు. అయినప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి నమోదు చేయనున్న దేశంగా భారత్ నిలవనుందన్నారు.
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాజీవ్ కుమార్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 6.07 శాతానికి చేరిన విషయం తెలిసిందే. 2021-22లో ఆస్తుల నగదీకరణ ద్వారా సమకూర్చుకోవాలనుకున్న రూ.88,000 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకుంటుందని అంచనా వేశారు. వచ్చే నాలుగేళ్లలో నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్లో భాగంగా రూ.6 లక్షల కోట్లు సమీకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల గురించి మాట్లాడుతూ.. ప్రపంచ పరిణామాలననుసరించి అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయని రాజీవ్ తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఓసారి సుంకాలు తగ్గించిందని గుర్తుచేశారు. ఈసారి తగ్గించాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ముందు రావాలని సూచించారు. ఏదేమైనప్పటికీ.. అన్ని కమొడిటీల ధరలపై ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. అవసరమైన సమయంలో చర్యలు తీసుకుంటుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?