Russian Oil: రెండింతలకు రష్యా చమురు దిగుమతులు?
అధిక ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు భారత ప్రభుత్వం ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటోంది....
పెంచుకునే ప్రయత్నాల్లో భారత్!
దిల్లీ: అధిక ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు భారత ప్రభుత్వం ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటోంది. రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తున్న కేంద్రం.. అక్కడి నుంచి దిగుమతులను రెండింతలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకు ప్రభుత్వరంగ చమురు శుద్ధి సంస్థలు కూడా సంసిద్ధంగా ఉండడంతో రష్యాతో చర్చలు ప్రారంభించింది.
దాదాపు ఆరు నెలల సరఫరాకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకొనేందుకు దేశీయ చమురు సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఈ మేరకు రష్యా ప్రభుత్వ సంస్థ అయిన రాస్నెఫ్ట్తో చర్చలు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కుదిరిన ఒప్పందాల ప్రకారం అందుతున్న చమురుకు ఇది అదనం కావడం గమనార్హం. ధర, పరిమాణంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందానికి కావాల్సిన నిధులను పూర్తిగా భారత బ్యాంకులే సమకూర్చనున్నట్లు సమాచారం.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ సంస్థలు సహా ప్రైవేట్ కంపెనీలైన రిలయన్స్, నయారా ఎనర్జీ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ కొనుగోలు కార్యకలాపాలు పూర్తిగా విడివిడిగా జరుగుతున్నాయి.
ఉక్రెయిన్పై దాడికి వ్యతిరేకంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ దేశ చమురును చాలా దేశాలు కొనుగోలు చేయడం లేదు. సౌదీ సహా పలు చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొంటున్నాయి. మరోవైపు రష్యా నుంచి నౌకల ద్వారా వచ్చే చమురు దిగుమతులపై ఐరోపా సమాఖ్య ఇటీవలే నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా చమురు అమ్మకాలను ఎలాగైనా కొనసాగించాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తక్కువ ధరకే చమురును అందించేందుకు ముందకు వచ్చింది. దీంతో గత మూడు నెలలుగా భారత్ రాయితీ ధరతో కూడిన చమురును రష్యా నుంచి పొందుతోంది. తాజాగా ఈ దిగుమతులను రెండింతలు చేయాలని యోచిస్తోంది.
భారత ప్రభుత్వం ఫిబ్రవరి ఆఖరు నుంచి మే ఆరంభం నాటికి రష్యా నుంచి 40 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. 2021లో వచ్చిన మొత్తం దిగుమతులతో పోలిస్తే ఇది 20 శాతం అధికం. మే నెలలో ఒక్కోరోజు 7,40,000 బ్యారెళ్లు, ఏప్రిల్లో 2,84,000 బ్యారెళ్ల చమురు దిగుమతి అయ్యింది. అయితే, ఈ దిగుమతుల అంతర్జాతీయ ఆంక్షలకు ఏమాత్రం విరుద్ధం కాకపోవడం గమనార్హం. రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించుకోవాలని అమెరికా సహా ఐరోపా దేశాలు తొలుత భారత్పై ఒత్తిడి పెంచాయి. కానీ, ఐరోపా చేస్తున్న కొనుగోళ్లతో పోలిస్తే భారత దిగుమతులు చాలా తక్కువని కేంద్ర గట్టిగా బదులిచ్చింది.
భారత చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులు ద్వారానే సమకూరుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు సైతం పెరిగాయి. తాజాగా రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు లభిస్తుండడంతో ఎక్సైజ్ సుంకం తగ్గింపు రూపంలో కేంద్రం ప్రజలకు ఉపశమనం కల్పించగలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం