SBI chairman: మాంద్యం ప్రభావం భారత్పై అంతగా ఉండదు: ఎస్బీఐ ఛైర్మన్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యం ప్రభావం ఎదుర్కొన్నా.. దాని ప్రభావం భారత్పై మాత్రం అంతగా ఉండదని ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా అన్నారు.
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలనూ ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు సైతం దీని గురించి హెచ్చరికలు చేస్తున్నాయి. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యం ప్రభావం ఎదుర్కొన్నా.. దాని ప్రభావం భారత్పై మాత్రం అంతగా ఉండదని ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా అన్నారు. దేశంలో వృద్ధికి ఢోకా లేదని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని చెప్పారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ సదస్సులో పాల్గొనేందుకు వాషింగ్టన్ వచ్చిన ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాంద్యం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్పై మాంద్యం ప్రభావం అంతగా ఉండబోదని దినేశ్ ఖారా అన్నారు. బీటా ఫ్యాక్టర్నే (స్టాక్ హెచ్చుతగ్గులు కొలిచే విలువ) పరిగణనలోకి తీసుకుంటే ఎగుమతులు ప్రధానంగా ఉన్న దేశాలతో పోలిస్తే భారత్ బీటా ఫ్యాక్టర్ చాలా తక్కువగా ఉందని చెప్పారు. ప్రపంచ ఆర్థికంతో పోలిస్తే భారత్ వృద్ధి రేటు అంచనాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వరకు వృద్ధి నమోదు చేయొచ్చని చెప్పారు. ప్రపంచ దేశాలను ద్రవ్యోల్బణం వణికిస్తున్నప్పటికీ దేశీయంగా అదుపులోనే ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుత ద్రవ్యోల్బణానికి డిమాండ్ కారణం కాదని దినేశ్ ఖారా తెలిపారు. సప్లయ్ ఆధారిత ద్రవ్యోల్బణం అని పేర్కొన్నారు. సరఫరా గొలుసులో అంతరాలే ప్రపంచంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. ఇప్పటికీ సామర్థ్య వినియోగం 71 శాతం మాత్రమే ఉందని చెప్పారు. దీన్ని పెంచుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణానికి క్రూడాయిల్ ధరలూ మరో కారణమని చెప్పారు. ఏదేమైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ రానున్న రోజుల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కోబోతున్నాయని చెప్పారు. వీటిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. భారత వృద్ధి అవకాశాలు మున్ముందు మరింత మెరుగుపడతాయని ధీమా వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి