రష్యాలో నిలిచిపోయిన ₹975 కోట్ల భారత కంపెనీల డివిడెండ్లు
ఉక్రెయిన్పై దాడికి వ్యతిరేకంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల సెగ భారత కంపెనీలకూ తాకింది....
దిల్లీ: ఉక్రెయిన్పై దాడికి వ్యతిరేకంగా రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల సెగ భారత కంపెనీలకూ తాకింది. రష్యన్ కంపెనీల్లో వాటాలున్న కొన్ని భారత చమురు సంస్థలకు భారీ ఎత్తున డివిడెండ్ రావాల్సి ఉంది. కానీ, ఆంక్షల కారణంగా అవి నిలిచిపోయాయి. ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ల కన్సార్టియానికి రష్యాకు చెందిన వ్యాంకోర్నెఫ్ట్ చమురు ప్రాజెక్టులో 23.9 శాతం, టాస్-యుర్యాక్ ఆయిల్ఫీల్డ్లో 29.9 శాతం వాటాలున్నాయి. వ్యాంకోర్నెఫ్ట్ ఆరు నెలలు, టాస్ యుర్యాక్ మూడు నెలలకోసారి డివిడెంట్లు చెల్లిస్తుంటాయి. అందులో భాగంగా భారత కంపెనీలకు వాటి నుంచి 125.49 మిలియన్ డాలర్లు (రూ.975.03 కోట్లు) రావాల్సి ఉంది. కానీ, ఆంక్షల కారణంగా ఆ సొమ్మంతా రష్యన్ బ్యాంకుల్లోనే ఇరుక్కుపోయింది. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి రష్యన్ బ్యాంకులను బహిష్కరించడమే ఇందుకు కారణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగనా సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్