ATF: తగ్గిన విమాన ఇంధన ధరలు.. ఈ ఏడాదిలో తొలిసారి

విమాన ఇంధనం ఏవియేషన్‌ టర్బైన్ ఫ్యుయల్‌ (ATF) ధరల్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOCL) బుధవారం తగ్గించింది....

Published : 01 Jun 2022 11:33 IST

దిల్లీ: విమాన ఇంధనం ఏవియేషన్‌ టర్బైన్ ఫ్యుయల్‌ (ATF) ధరల్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOCL) బుధవారం తగ్గించింది. ఈ ఏడాది ధరల్ని తగ్గించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దిల్లీలో కిలో లీటర్‌ ఏటీఎఫ్‌ ధర 1.3 శాతం తగ్గి రూ.1.21 లక్షలకు చేరింది. 

మే 16న ఏటీఎఫ్‌ ధరలు 5 శాతం పెరగడంతో కిలోలీటర్‌ ధర రూ.1.23 లక్షలకు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో రూ.72,062గా ఉన్న కిలోలీటర్‌ విమాన ఇంధన ధర భారీగా పెరిగి రూ.1.23 లక్షల వద్ద జీవనకాల గరిష్ఠానికి చేరింది. దాదాపు 62 శాతం పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత సరఫరా సమస్యలు తలెత్తి ధరలు మరింత ఎగబాకాయి. భారత్‌ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది.

విమానయాన వ్యయాల్లో 40 శాతం వాటా ఇంధనానిదే. దీంతో ఇంధన ధరలు పెరిగినా.. తగ్గినా.. ఆ ప్రభావం విమాన ప్రయాణాలపై ఉంటుంది. ఈ ఏడాది మార్చి 16న గరిష్ఠంగా ఏటీఎఫ్‌ ధరను 18.3 శాతం పెంచారు. ఏప్రిల్‌ 1న రెండు శాతం, ఏప్రిల్‌ 16న 0.2 శాతం, మే 1న 3.22 శాతం చొప్పున ధరలు పెరిగాయి. మొత్తంగా ఈ ఏడాదిలో ధరలు 10 సార్లు ఎగబాకాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని