Start Ups: ఈ ఏడాది స్టార్టప్లలో 60 వేల ఉద్యోగాల కోత!
ఈ ఏడాది మొత్తంగా భారత్లోని అంకుర సంస్థలు 60వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ఓ ప్రముఖ నివేదిక అంచనా వేసింది....
దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అలుముకుంటున్న ఆర్థిక మాంద్యం భయాలు అంకుర సంస్థల్ని (Start Ups) తీవ్రంగా కలవరపెడుతున్నాయి. నిధుల కొరత ఈ కంపెనీలను ఇప్పుడు వేధిస్తున్న ప్రధాన సమస్య. దీంతో నిర్వహణ భారాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. ఈ ఏడాది మొత్తంగా భారత్లోని అంకుర సంస్థలు 60 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ఓ ప్రముఖ నివేదిక అంచనా వేసింది.
ఇప్పటికే పలు ప్రముఖ అంకుర సంస్థ (Start Ups)లు దాదాపు 12 వేల మంది ఉద్యోగులకు ఇంటిదారి చూపించాయి. వీటిలో ఓలా, బ్లింకిట్, బైజూస్, అన్అకాడమీ, వేదాంతు, కార్స్24, మొబైల్ ప్రీమియర్ లీగ్, లిడో లెర్నింగ్, ఎంఫైన్, ట్రెల్, ఫార్ఐ, ఫర్లాంకో వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ, ఖర్చుల నిర్వహణ పేరిట మరో 50 వేల మందిని ఈ ఏడాది స్టార్టప్లు తొలగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కరోనా సంక్షోభ సమయంలో భారీగా లాభపడ్డ అంకుర సంస్థలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఆదాయాలు కుంగి వాటి విలువ క్రమంగా తగ్గిపోతోంది. ఫలితంగా నిధుల సమీకరణ గతంతో పోలిస్తే క్లిష్టంగా మారింది.
అమెరికాలో ఇదీ పరిస్థితి...
నెట్ఫ్లిక్స్, రాబిన్హుడ్ వంటి అంతర్జాతీయ సంస్థలు సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే పనిలో పడ్డాయి. అమెరికాలో టెక్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోందని క్రంచ్బేస్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. 2022లో ఇప్పటి వరకు 22 వేల మంది ఉద్యోగులు ఇంటిదారి పట్టారు. నెట్ఫ్లిక్స్ తమ ఉద్యోగుల సంఖ్యలో 4 శాతానికి సమానమైన 450 మందిని తొలగించింది. పేపాల్ 83 మందిని, రాబిన్హుడ్ 300 మందిని, వర్జిన్ హైపర్లూప్ 111 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మరోవైపు క్రిప్టో ఎక్స్ఛేంజీలైన వాల్డ్, బైబిట్, కాయిన్బేస్, జెమినీ, క్రిప్టో.కామ్, బిట్పాండా సైతం తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటామని ప్రకటించాయి. పోకీమాన్ జీఓ గేమ్ను అభివృద్ధి చేసిన నియాన్టిక్ 90 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపింది. మరోవైపు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సైతం 10 శాతం మందిని తొలగిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్