OTT: 10 ఏళ్లలో 15 బి.డాలర్లకు భారత ఓటీటీ పరిశ్రమ
వచ్చే దశాబ్ద కాలంలో భారత ఓటీటీ(ఓవర్-ది-టాప్-OTT) పరిశ్రమ విలువ 13-15 బిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) అంచనా వేసింది....
దిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో భారత ఓటీటీ(ఓవర్-ది-టాప్-OTT) పరిశ్రమ విలువ 13-15 బిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) అంచనా వేసింది. ఏటా దాదాపు 22-25 శాతం వృద్ధి నమోదు చేస్తుందని తెలిపింది. ఈ రంగంలో దాదాపు 40 సంస్థలు పోటీ పడుతున్నాయని పేర్కొంది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగం వేగంగా విస్తరించడం, ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పెరగడం కూడా దీనికి దోహదం చేస్తుందని తెలిపింది.
ఈ రంగంలో అంతర్జాతీయ సంస్థలైన నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ వంటివి భారత్కు అనుకూలమైన కార్యక్రమాలు రూపొందించడం కూడా ఓటీటీ ఎదుగుదలకు దన్నుగా నిలుస్తోందని బీసీజీ తెలిపింది. అలాగే ధరలను సైతం భారత వినియోగదారులకు అనుగుణంగా నిర్ణయించడం కలిసి వస్తోందని అభిప్రాయపడింది. అమెరికాతో పోలిస్తే భారత్లో ఓటీటీ సభ్యత్వ ధరలు 70-90 శాతం తక్కువగా ఉన్నాయని పేర్కొంది.
భారత్ ఆధారంగా రూపొందుతున్న వీడియో కంటెంట్పై పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయని బీసీజీ తెలిపింది. దీంతో అధిక కార్యక్రమాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొంది. విదేశాల్లో ఉన్న భారతీయులకు కూడా ఇవి చేరుతున్నాయని గుర్తుచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..