India GDP: ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7 శాతం: NSO
India GDP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం అంచనా వేసింది. గతేడాది కంటే ఇది తక్కువ కాగా.. ఆర్బీఐ వెలువరించిన అంచనాల కంటే ఎక్కువ కావడం గమనార్హం.
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో జీడీపీ (GDP) 7 శాతం వృద్ధి నమోదు కావొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం వెల్లడించింది. గతేడాది 8.7 శాతంతో పోలిస్తే ఈ సారి తక్కువ వృద్ధి నమోదు కానుండడం గమనార్హం. మైనింగ్, తయారీ రంగంలో వృద్ధి తగ్గుముఖం పట్టడమే దీనికి కారణం. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (NSO) శుక్రవారం తన తొలి ముందస్తు అంచనాలను వెలువరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెలువరించిన 6.8 శాతం వృద్ధి అంచనాలతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ కావడం గమనార్హం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం 1.6 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేయొచ్చని గణాంక కార్యాలయం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 9.9 శాతం వృద్ధి నమోదు చేసింది. అలాగే, మైనింగ్ రంగం సైతం గతేడాది 11.5 శాతం వృద్ధి నమోదు చేయగా.. ఈ సారి కేవలం 2.4 శాతం మాత్రమే నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది.
ఇక స్థిర ధరల (2011-12) ప్రకారం రియల్ జీడీపీని గణించినప్పుడు ఈ ఏడాది రూ.157.60 లక్షలు కోట్లుగా ఉండనుందని గణాంక కార్యాలయం వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం ఇది రూ.147.36 లక్షల కోట్లుగా ఉంది. అదే ప్రస్తుత ధరల ప్రకారం జీడీపీని లెక్కించినప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ రూ.273.08 లక్షల కోట్లుగా ఉండనుంది. గతేడాదికి గానూ ఈ మొత్తం రూ.236.65 కోట్లుగా అంచనా వేసింది.
రంగాల వారీగా అంచనాలు..
వ్యవసాయ రంగం గతేడాది 3 శాతం వృద్ధి చెందగా.. ఈసారి 3.5 శాతం వృద్ధి నమోదు కావొచ్చని గణాంక కార్యాలయం తెలిపింది. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ సేవల రంగం 11.1 శాతం నుంచి 13.7 శాతానికి చేరనుందని అంచనా. ఆర్థిక, స్థిరాస్తి, వృత్తినైపుణ్య సేవలు 4.2 శాతం నుంచి 6.4 శాతానికి పెరగనున్నాయి. నిర్మాణ రంగం 11.5 శాతంతో పోలిస్తే 9.5 శాతానికి తగ్గనుంది. ప్రభుత్వ పాలన, రక్షణ, ఇతర సేవలు 12.6 శాతం నుంచి 7.9 శాతానికి చేరనున్నాయని గణాంక కార్యాలయం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్