Russian Crude Oil: 35 శాతం చమురు రష్యా నుంచే
Russian Crude Oil: వోర్టెక్సా వివరాల ప్రకారం ఫిబ్రవరిలో ఇరాక్ నుంచి రోజుకు 9,39,921 బ్యారెళ్లు, సౌదీ అరేబియా నుంచి 6,47,813 బ్యారెళ్లు, యూఏఈ నుంచి 4,04,570 బ్యారెళ్లు, అమెరికా నుంచి 2,48,430 బ్యారెళ్లు, రష్యా నుంచి 16 లక్షల బ్యారెళ్ల చమురు భారత్కు దిగుమతి అయ్యింది.
దిల్లీ: రష్యా (Russia) నుంచి భారత్కు చమురు (Crude Oil) దిగుమతి ఫిబ్రవరిలో మరింత పెరిగింది. మన దేశానికి చమురు (Crude Oil) సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో రష్యా (Russia) వరుసగా ఐదోనెలా తొలిస్థానంలో నిలిచింది. 2023 ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 16 లక్షల పీపాలకు పైగా చమురు (Crude Oil) దిగుమతి అయినట్లు ఇంధన సరఫరా సమాచారాన్ని సేకరించే వోర్టెక్సా వెల్లడించింది. ఇది ఇరాక్, సౌదీ అరేబియా.. రెండూ కలిపి భారత్కు సరఫరా చేస్తున్న చమురు కంటే ఎక్కువ కావడం గమనార్హం.
2022 మార్చి 31 నాటికి భారత్ ఏటా దిగుమతి చేసుకుంటున్న చమురు (Crude Oil)లో రష్యా (Russia) వాటా కేవలం 0.2 శాతం మాత్రమే. ఫిబ్రవరి నాటికి అది రోజుకి 16 లక్షల బ్యారెళ్లకు చేరడం గమనార్హం. గత ఏడాది నవంబరులో రోజుకి 9,09,403 బ్యారెళ్లు, అక్టోబరులో 9,35,556 పీపాల చమురు దిగుమతి అయ్యింది. అక్టోబరులో తొలిసారి ఇరాక్, సౌదీ అరేబియాను అధిగమించి భారత్కు చమురు సరఫరా చేస్తున్న అతిపెద్ద దేశంగా రష్యా (Russia) నిలిచింది. భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురులో ఇప్పుడు 35 శాతం రష్యా నుంచే వస్తోంది.
జలమార్గాన సరఫరా అవుతున్న రష్యా (Russia) చమురు ధరపై ఐరోపా సమాఖ్య పరిమితి విధించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కో పీపా ఇప్పుడు 60 డాలర్ల కంటే తక్కువకే దొరుకుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి భారత్ దిగుమతుల్ని మరింత పెంచిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అత్యధికంగా చమురు వినియోగించుకునే దేశాల్లో భారత్ మూడోది. మొత్తం చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటోంది.
వోర్టెక్సా వివరాల ప్రకారం ఫిబ్రవరిలో ఇరాక్ నుంచి రోజుకు 9,39,921 బ్యారెళ్లు, సౌదీ అరేబియా నుంచి 6,47,813 బ్యారెళ్లు, యూఏఈ నుంచి 4,04,570 బ్యారెళ్లు, అమెరికా నుంచి 2,48,430 బ్యారెళ్ల చమురు భారత్కు దిగుమతి అయ్యింది. భారత్కు చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో అమెరికాను అధిగమించి యూఏఈ నాలుగో స్థానానికి చేరింది. సౌదీ నుంచి చమురు దిగుమతులు 16 శాతం, అమెరికా నుంచి 38 శాతం కుంగాయి.
ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాను నిలువరించడం కోసం పశ్చిమ దేశాలు ఆ దేశ చమురుపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో తమ చమురును రాయితీ ధరకు అందించడానికి రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఆ దేశం నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం ప్రారంభానికి ముందు పశ్చిమాసియా దేశాల నుంచే భారత్ 60 శాతం దిగుమతి చేసుకునేది. మరో 14 శాతం ఉత్తర అమెరికా దేశాలు, 12 శాతం పశ్చిమ ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాల నుంచి 5 శాతం, రష్యా నుంచి కేవలం 2 శాతం చమురు మాత్రమే దిగుమతి అయ్యేది. రష్యా- ఉక్రెయిన్ ఘర్షణ తర్వాత పశ్చిమాఫ్రికా దేశాల చమురు ఖరీదుగా మారింది. రష్యా చమురును కొనడం ఆపేసిన ఐరోపా దేశాలు పశ్చిమాఫ్రికా చమురుపై ఆధారపడడమే అందుకు కారణం. భారత ప్రయోజనాల దృష్ట్యా చౌకగా దొరికిన దగ్గరే చమురును కొనుగోలు చేస్తామని విదేశాంగ మంత్రి 2022 డిసెంబరు 7న రాజ్యసభలో స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM