Stock Market: ఎనిమిదో రోజూ దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market: అమెరికాలో వడ్డీరేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తామన్న ఫెడ్ ఛైర్మన్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు వీచాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్లూ అదే బాటలో పయనించాయి.
ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఎనిమిదో రోజూ దూసుకెళ్లాయి. గురువారం ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు రోజంతా ఆ జోరును కొనసాగించాయి. గతకొన్ని రోజుల తరహాలోనే సూచీలు నేడు కూడా సరికొత్త జీవనకాల గరిష్ఠాల్ని నమోదు చేశాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు విషయంలో వేగాన్ని తగ్గిస్తామన్న ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు సూచీల పరుగుకు దోహదం చేశాయి. మరోవైపు చమురు ధరలు దిగువ శ్రేణుల్లో ట్రేడవుతుండడం, రూపాయి బలపడడం కూడా ర్యాలీకి కలిసొచ్చాయి.
సెన్సెక్స్ ఉదయం 63,357.99 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 63,583 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆఖరుకు 184.54 పాయింట్ల లాభంతో 63,284.19 వద్ద స్థిరపడింది. 18,871.95 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 18,887.60 వద్ద తాజా గరిష్ఠాన్ని తాకింది. చివరకు 54.15 పాయింట్లు ఎగబాకి 18,812.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, ఎల్అండ్టీ, ఎస్బీఐ షేర్లు లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, పవర్గ్రిడ్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్యూఎల్, టైటన్, మారుతీ, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.15 వద్ద నిలిచింది.
మార్కెట్లోని మరిన్ని విశేషాలు..
☛ వొడాఫోన్ ఐడియా షేరు ధర ఈరోజు 1 శాతానికి పైగా కుంగింది. ఎస్బీఐ నుంచి ఈ కంపెనీ రూ.16,000 కోట్ల రుణానికి ప్రయత్నాలు ముమ్మరం చేసిందన్న వార్తలే షేరును కిందకు లాగాయి.
☛ క్యామాస్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.608 కోట్లతో 98 మిలియన్ల జొమాటో షేర్లను కొనుగోలు చేసింది. మరోవైపు అలీబాబా గ్రూప్ 263 మిలియన్ల షేర్లను విక్రయించిన విషయం తెలిసిందే. దీంతో జొమాటో స్టాక్ ధర గత రెండు రోజుల్లో 5 శాతానికి పైగా పెరిగి ఈరోజు రూ.66.65 వద్ద స్థిరపడింది.
☛ బిస్లరీ బ్రాండ్ పేరిట ప్యాకేజ్డ్ వాటర్, కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ విక్రయిస్తున్న ఓరియెంట్ బెవరేజెస్ షేరు వరుసగా ఆరో రోజూ 5 శాతం పెరిగి రూ.179.05 వద్ద అప్పర్ సర్క్యూట్ని తాకింది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ ధర 77 శాతం పెరగడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..