IndiGo: ఇండిగో స్పెషల్‌ ఆఫర్‌.. టికెట్ల ధరలపై భారీ రాయితీ!

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమాన టికెట్ల ధరలపై భారీ రాయితీ ప్రకటించింది. కేవలం రూ.915 ప్రారంభ ధరతో టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది...

Published : 04 Aug 2021 17:54 IST

దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమాన టికెట్ల ధరలపై భారీ రాయితీ ప్రకటించింది. కేవలం రూ.915 ప్రారంభ ధరతో టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్‌ కార్డు ఉన్నవారికి అదనంగా ఐదు శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా ఆఫర్‌ చేస్తోంది. సంస్థ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఆఫర్లను ప్రకటించింది.

నేటి(ఆగస్టు 4) నుంచి ఆగస్టు 6 మధ్య టికెట్లను బుక్ చేసుకోవాలి. వీరు సెప్టెంబరు 1, 2021- మార్చి 26, 2022 మధ్య ప్రయాణించవచ్చు. ఫాస్ట్‌ ఫార్వర్డ్‌, 6ఈ ఫ్లెక్స్‌, 6ఈ బ్యాగ్‌పోర్ట్‌, కార్‌ రెంటల్‌ సర్వీస్‌ వంటి అదనపు సేవలను సైతం రూ.315లకే అందజేస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

అయితే, ఇండిగో వెబ్‌సైట్‌ ప్రకారం.. ఈ రాయితీ ధర కొన్ని ప్రత్యేక రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే విమానాల టికెట్ల కనీస ధర రూ.1,415గా ఉండడం గమనార్హం.

* హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.1,415, చెన్నైకి రూ.1,715, తిరుపతికి రూ.1,815, ముంబయి, దిల్లీ, గోవాకు రూ.1,915, విశాఖపట్నం, విజయవాడకు రూ.2,115గా విమాన టికెట్‌ ధరను నిర్ణయించారు.

విశాఖపట్నం నుంచి రాజమండ్రికి రూ.1,215, హైదరాబాద్‌, చెన్నైకి రూ.2,115, బెంగళూరుకు రూ.2,315 చొప్పున ఫ్లైట్ టికెట్‌ ధరలు ఉన్నాయి.

విజయవాడ నుంచి తిరుపతికి రూ.1,815, హైదరాబాద్‌కు రూ.2,015, చెన్నైకి రూ.2,315, బెంగళూరుకు రూ.2,815గా టికెట్‌ ధరలను నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని