పెట్టుబడి పెట్టే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
నష్టభయం వ్యక్తి వయసు, ఆదాయం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కో మదుపరికి ఒక్కోవిధంగా ఉంటుంది.
మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవగానే పెట్టుబడులను విక్రయించే వారుంటారు. దీనికి కారణం నష్టభయాన్ని తట్టుకోలోకపోవడం. అందుకే పెట్టుబడుల పోర్ట్ఫోలియో తయారు చేసుకునేటప్పుడు ఎంత రిస్క్ ఉంటుంది.. ఎంత రిస్క్ తీసుకోగలరు.. అని అంచనా వేసి, ఆ తర్వాతే ముందడుగు వేయాలి.
మదుపర్లు అంచనా వేసుకున్న దానికంటే, తక్కువ రాబడి వచ్చే పరిస్థితిని నష్టభయం అంటారు. ప్రభుత్వ సెక్యురిటీలలో తప్ప ప్రతీ పెట్టుబడి సాధనంలో ఎంతోకొంత నష్టభయం ఉంటుంది. నష్టభయ తీవ్రత ఆయా పెట్టుబడి సాధనాలు ఇచ్చే రాబడి పై ఆధారపడి ఉంటుంది. రాబడి, నష్టభయం రెండూ ఒకే దిశలో పయనిస్తాయి. ఎక్కువగా రిస్క్ ఉన్న పెట్టుబడి సాధనాల్లో ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ నష్టభయం ఉన్న సాధనాల్లో రాబడి కూడా తక్కువగానే ఉంటుంది.
నష్టభయం వ్యక్తి వయసు, ఆదాయం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక్కో మదుపరికి ఒక్కోవిధంగా ఉంటుంది. సదరు పెట్టుబడి పథకాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా సరైన నిర్ణయం తీసుకోగలరు. పెట్టుబడి చేసేముందు కొన్ని ప్రాథమిక విషయాలను పాటించడం ద్వారా నష్టం రాకుండా నివారించవచ్చు.
పెట్టుబడులు ప్రారంభించే ముందు ఎవరికి వారు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకోవాలి. ఒకవేళ ఏవైనా కారణాల చేత మార్కెట్లు 15 శాతం నష్టపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ముందే వేసుకోవాలి. రిస్క్ ప్రొఫైలర్ లు వివిధ ఆర్థిక సంస్థలు తమ వెబ్సైట్ లలో ఉంచుతాయి. వాటిని పూరించి మదుపర్లు తమ నష్టభయాన్ని అంచనా వేసుకోవచ్చు.
ఉదాహరణకు, మధ్య వయస్లులో ఉన్న వ్యక్తికి, పదవీ విరమణకు చేరవలో ఉన్న వ్యక్తికి రిస్క్ తీసుకునే విషయంలో చాలా తేడా ఉంటుంది. మధ్య వయసు వ్యక్తి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అతడు కొంత ఎక్కువ రిస్క్ ఉన్నవాటిలో పెట్టుబడులు చేసినా ఫర్వాలేదు. కానీ పదవీ విరమణ తీసుకున్న వ్యక్తి, అదేవిధంగా పదవీవిరమణకు దగ్గరగా ఉన్న వ్యక్తులు అయితే వయసు, బాధ్యతలు, నెలవారిగా ఆదాయం లేని కారణంగా అంత రిస్క్ తీసుకోలేరు. పెట్టుబడులు ప్రారంభించే ముందు మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు, ఎంత నష్టభయానికి సిద్థంగా ఉన్నారనేది విశ్లేషించుకోఉవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు మార్కెట్ల ఒడుదొడుకులను అదిగమించి రాబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది.
పెట్టుబడి పెట్టే ముందు మదుపర్లు ఎంత రిస్క్ తీసుకోగలరు అనేది కచ్చితంగా నిర్ణయించుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా రిస్క్ ఎక్కువగా ఉండే ఈక్విటీ పెట్టుబడులలో పెట్టే ముందు దీర్ఘకాలం కొనసాగేందుకు సిద్ధం కావాలి. ఆర్థిక లక్ష్యాలను కూడా దానికి అనుగుణంగా ఏర్పరుచుకోవాలి. ఆ విధంగా మీరు ఎంత వరకు నష్టభయం తట్టుకోగలరు, పెట్టుబడుల లక్ష్యం ఏమిటి, ఎంతకాలం కొనసాగిస్తారు వంటి వాటిపై స్పష్టత ఉంటే నష్ట భయం ఒత్తిడిని ఎదుర్కునే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?