IPO: పండగ సీజన్లో పబ్లిక్ ఇష్యూల జోరు.. సిద్ధంగా 10 కంపెనీలు!
2022లో పబ్లిక్ ఇష్యూల జోరు తగ్గింది. తిరిగి ఈ పండగ సీజన్లో మళ్లీ ఐపీఓల హవా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 10 సంస్థలు ఐపీఓకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పండగ సీజన్లో ఐపీఓల జోరు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 10 సంస్థలు పబ్లిక్ ఇష్యూకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ వచ్చే 4-6 వారాల్లో తమ ఐపీఓలను ప్రారంభించే అవకాశం ఉంది. ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్, ప్రిస్టైన్ లాజిస్టిక్స్, ల్యాండ్మార్క్ కార్స్, సెంకో గోల్డ్, డీసీఎక్స్ సిస్టమ్స్, కేన్స్ టెక్నాలజీ, యూనీపార్ట్స్ ఇండియా త్వరలో ఐపీఓకి రానున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఈరోజే ట్రాక్షన్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైన విషయం తెలిసిందే.
పైన పేర్కొన్న కంపెనీల్లో చాలా వరకు త్వరలోనే ఐపీఓలను ప్రారంభించనున్నాయి. అయితే, కొన్ని మాత్రం మార్కెట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడితే వెనక్కి తగ్గే అవకాశం ఉందని పలువురు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు తెలిపారు. 2021లో రికార్డు స్థాయిలో కంపెనీలు ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున నిధులను సమీకరించాయి. కానీ, 2022లో పరిస్థితులు మారిపోయాయి. ఈక్విటీ మార్కెట్లలోని తీవ్ర ఒడుదొడుకులు, ద్రవ్యోల్బణం, ఆర్థికమాంద్యం వంటి అంశాలు ప్రతికూలంగా మారాయి. సెప్టెంబరు త్రైమాసికంలోనైతే ఐపీఓల ద్వారా కేవలం రూ.2,965 కోట్ల సమీకరణ మాత్రమే జరిగింది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న 2020 జులై త్రైమాసికం తర్వాత ఇదే అత్యల్పం.
స్థూలంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఐపీఓల్లో పాల్గొనేందుకు కావాల్సిన ద్రవ్యలభ్యత మార్కెట్లో అందుబాటులో ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఐపీఓకి వచ్చిన హర్ష ఇంజినీర్స్, ఎలక్ట్రానిక్స్ మార్ట్ షేర్లు 70 రెట్లు సబ్స్క్రైబ్ అవడమే అందుకు నిదర్శనమని తెలిపారు. రానున్న ఐపీఓల్లో ఒక్కోటి రూ.1,000 కోట్ల దిగువనే సమీకరించనుండడం గమనార్హం. అలాగే ధరల శ్రేణిని సైతం సమంజసంగానే నిర్ణయించినట్లు పలువురు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు తెలిపారు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కంపెనీల విలువను పునఃమదింపు చేసినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా