iQoo Z7 5G: ₹17 వేలకే ఐకూ 5జీ ఫోన్‌.. ఫీచర్లు ఇవిగో..!

iQoo Z7 5G Full details: ఐకూ నుంచి మరో ఫోన్‌ విడుదలైంది. రూ.20వేలలోపు iQoo Z7 5G పేరిట కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

Published : 21 Mar 2023 14:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ వివో సబ్‌ బ్రాండ్‌ ఐకూ (iQoo) మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఐకూ జడ్‌7 5జీ (iQoo Z7 5G) పేరిట ఈ మొబైల్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది. భారత్‌ మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా ఈ మొబైల్‌ను రూపొందించినట్లు ఐకూ వెల్లడించింది. రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తున్న ఈ ఫోన్‌ విక్రయాలు నేటి నుంచే (మార్చి 21) ప్రారంభమవుతున్నాయి. మరి ఫీచర్లపై లుక్కేద్దామా?

ఐకూ జడ్‌ 7 5జీ (iQoo Z7 5G) రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధరను రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధరను రూ.19,999గా పేర్కొంది. బ్యాంక్‌ ఆఫర్‌తో కొనుగోలు చేసిన వారికి బేస్‌ వేరియంట్‌ రూ.17,499కే లభిస్తుంది. అమెజాన్‌, ఐకూ ఇ-స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చని ఆ కంపెనీ తెలిపింది. నార్వే బ్లూ, పసిఫిక్‌ నైట్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది.

ఇక ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇందులో 6.38 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే అమర్చారు. 90హెర్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌తో ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ లభిస్తుంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 920 ప్రాసెసర్‌తో వస్తుంది. వెనుక వైపు 64 ఎంపీ మెయిన్‌ కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో వస్తుండగా.. ఇంకోటి 2 ఎంపీ పోర్ట్రెయిట్‌ లెన్స్‌ను అమర్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ పంచ్‌ హోల్‌ కెమెరా ఇస్తున్నారు. వెనుక వైపు కెమెరాతో 4కె వీడియోలను రికార్డు చేయొచ్చు. ఇంటర్నల్‌ స్టోరేజీని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ 44W ఫ్లాష్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వైఫై 6, బ్లూటూత్‌ 5.2, 3.5 ఎంఎం జాక్‌, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ కలిగిన ఈ ఫోన్‌ ప్లాస్టిక్‌ బాడీతో వస్తోంది. రూ.20వేల్లోపు 5జీ ఫోన్‌ కోసం చూస్తున్న వారు ఈ ఫోన్‌ను పరిశీలించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని