IRCTC Tour Package: 6 రోజుల గంగా రామాయణ్ యాత్ర.. ప్యాకేజీ వివరాలు ఇవే..
IRCTC Ganga Ramayan Yatra: ఐఆర్సీటీసీ పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. పర్యాటక ప్రాంతాలు, దర్శనీయ స్థలాలను కవర్ చేస్తూ అనేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అందులో భాగంగా వారణాసి నుంచి లఖ్నవూ వరకు సాగే ‘గంగా రామాయణ్ యాత్ర’ను కూడా అందిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు ఐఆర్సీటీసీ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీల (IRCTC Tour Package)ను అందిస్తోంది. నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే కావాల్సిన ప్రాంతాన్ని చూపిస్తూ వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఈ క్రమంలోనే ‘గంగా రామాయణ్ యాత్ర (Ganga Ramayan Yatra)’ పేరిట ఐఆర్సీటీసీ పలు పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం కల్పిస్తోంది. ఈ యాత్ర వివరాలేంటో చూద్దాం..
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా నైమిశారణ్య, ప్రయాగ్రాజ్, సారనాథ్, వారణాసి పుణ్యక్షేత్రాలను చూడొచ్చు. ఈ యాత్ర ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్ నుంచి విమానంలో వారణాసికి చేరుకోవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. చివరి రోజు లఖ్నవూ నుంచి హైదరాబాద్ వచ్చేస్తే యాత్ర సంపూర్ణమవుతుంది. 2023 మే 25న, తిరిగి జూన్ 7న ఈ యాత్ర ప్రారంభమవుతుంది. కానీ, 25వ తేదీ యాత్రకు టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడయ్యాయి.
యాత్ర సాగుతుందిలా..
- తొలి రోజు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వారణాసికి చేరుకుంటారు. ముందే బుక్ చేసిన హోటల్కు చేరుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్న భోజనం ముగించుకొని కాశీ ఆలయ సందర్శనకు తీసుకెళ్తారు. తర్వాత గంగా ఘాట్ సందర్శన ఉంటుంది. రాత్రి వారణాసిలోనే బస ఏర్పాటు చేస్తారు. ఆలయం, ఘాట్కు చేరుకునేటప్పుడు అయ్యే ప్రయాణ ఖర్చులను యాత్రికులే భరించాల్సి ఉంటుంది.
- రెండో రోజు ఉదయం అల్పాహారం పూర్తి చేసుకొని సారనాథ్కు బయలుదేరుతారు. అక్కడ దర్శనం పూర్తిచేసుకొని మధ్యాహ్నం మళ్లీ వారణాసికి చేరుకుంటారు. అక్కడి నుంచి బిర్లా ఆలయానికి వెళతారు. తర్వాత ఘాట్ల సందర్శన, షాపింగ్ అనేది యాత్రికుల ఇష్టం. రాత్రి బస రెండో రోజు కూడా వారణాసిలోనే ఉంటుంది.
- మూడో రోజు వారణాసి నుంచి బయలుదేరి ప్రయాగ్రాజ్ చేరుకుంటారు. అక్కడి అలోపీ దేవీ ఆలయం, త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. సాయంత్రం అయోధ్యకు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.
- నాలుగో రోజు అల్పాహారం ముగించుకొని అయోధ్యలోని ఆలయాన్ని దర్శిస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి బయలు చేరి లఖ్నవూ చేరుకుంటారు. రాత్రి అక్కడే హోటల్లో బస ఏర్పాటు చేస్తారు.
- ఐదో రోజు లఖ్నవూలోని హోటల్లో అల్పాహారం పూర్తి చేసి నైమిశారణ్యానికి బయలుదేరుతారు. రోజంతా అక్కడే గడపాల్సి ఉంటుంది. సాయంత్రం తిరిగి హోటల్కు చేరుకుంటారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
- ఆరో రోజు అల్పాహారం ముగించుకొని లఖ్నవూలోని చారిత్రక కాంప్లెక్స్ను సందర్శిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నానికి హోటల్ చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటల కల్లా ఎయిర్పోర్ట్కు చేరుకొని విమానంలో హైదరాబాద్కి వచ్చేస్తారు. దీంతో యాత్ర పూర్తవుతుంది.
ప్యాకేజీలో భాగంగా అందేవి..
- హైదరాబాద్ నుంచి వారణాసి, లఖ్నవూ నుంచి హైదరాబాద్కు విమాన టికెట్లు
- రెండు రాత్రులు వారణాసిలో, ఒక రాత్రి అయోధ్యలో, రెండు రాత్రులు లఖ్నవూలో బస
- ఐదు రోజులు అల్పాహారం, రాత్రి భోజనం. మధ్యాహ్న భోజనం మాత్రం ఒక రోజే ఉంటుంది.
- ప్రయాణ బీమా
ప్యాకేజీలో ఉండనివి..
- సందర్శనీయ స్థలాలు, ఆలయాల దగ్గర ప్రవేశ టికెట్ల రుసుములు
- మధ్యాహ్న భోజనం సహా ఇతర ఆహార పదార్థాల ఖర్చు
- విమానంలో భోజనం
- టూర్ గైడ్లు, డ్రైవర్లు సహా ఇతరులకు ఇచ్చే టిప్స్
- ఇతర వ్యక్తిగత ఖర్చులు
- పూజా ఖర్చులు
ప్యాకేజీ ఛార్జీలు.. (ఒకరికి)
- సింగిల్ ఆక్యుపెన్సీ- రూ.36,850
- డబుల్ ఆక్యుపెన్సీ- రూ.29,900
- ట్రిపుల్ ఆక్యుపెన్సీ- రూ.28,200
- చైల్డ్ విత్ బెడ్ (5- 11ఏళ్లు)- రూ.24,600
- చైల్డ్ వితౌట్ బెడ్ (5- 11ఏళ్లు)- రూ.24,600
- చైల్డ్ వితౌట్ బెడ్ (2- 4ఏళ్లు)- రూ.18,300
★ యాత్ర ప్రారంభం కావడానికి 7 రోజుల ముందు వరకు మాత్రమే టికెట్ రద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. యాత్ర ప్రారంభం కావడానికి ఇంకా మిగిలి ఉన్న రోజులను బట్టి నిర్దేశిత మొత్తాన్ని రీఫండ్ కింద చెల్లిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
కౌంటర్కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. UTS యాప్తో బుకింగ్ ఎలా..?
UTS app: టికెట్ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం.. -
ఆధార్ కార్డ్లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో తప్పుందా? మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్డేట్ చేసుకోవాలో చూడండి.. -
పెట్టుబడి ప్రభుత్వ బాండ్లలో
చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం. -
టెక్నాలజీ కంపెనీల్లో
బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
ఆధార్ ఏటీఎం.. ఇంటి నుంచే క్యాష్ విత్డ్రా ఎలా చేసుకోవాలి?
Aadhaar ATM: ఇంటి నుంచే డబ్బు విత్డ్రా చేసుకొనే సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందిస్తోంది. దీన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.. -
వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు
IRCTC tour package: వేసవిలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లతో ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ వివరాలను ఓసారి పరిశీలించండి. -
టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి భరోసానిచ్చేలా
బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్ పాలసీలు. వీటిని ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు. -
కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ
IRCTC tour package: వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న కేరళ టూర్ ప్యాకేజీ వివరాల్ని పరిశీలించండి.. -
తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి.. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
డిజీ లాకర్తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది. -
Paytm పేమెంట్స్ బ్యాంక్లో ఈ సేవలకు.. మరికొన్ని రోజులే గడువు
Paytm payments bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో కొన్ని సేవలకు గడువు మార్చి 15తో ముగియనుంది. ఆ తర్వాత వాటిని కొనసాగించలేరు. -
Aadhaar Update: ఆధార్ ఉచిత అప్డేట్కు మరోసారి గడువు పొడిగింపు
ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగిస్తున్నట్లు ఉడాయ్ తెలిపింది. -
ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు
ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్