ఆదాయం కోసం IRCTC ₹1000 కోట్ల ప్లాన్.. ప్రయాణికుల డేటా మాటేమిటి?
IRCTC monetisation plan in telugu: ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్ డేటాను మానిటైజ్ చేయాలని IRCTC భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటురంగ కంపెనీలతో ఈ మేరకు వ్యాపారం చేయాలని చూస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.1000 కోట్లు ఆదాయం రావచ్చని అంచనావేస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: రైల్వే టికెటింగ్లో ఏకఛత్రాధిపత్యం కలిగి ఉన్న ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్ డేటాను మానిటైజ్ చేయాలని భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటురంగ కంపెనీలతో ఈ మేరకు వ్యాపారం చేయాలని చూస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.1000 కోట్ల ఆదాయం రావచ్చని అంచనావేస్తోంది. ఇందుకోసం ఓ కన్సెల్టెంట్ను నియమించుకునేందుకు తాజాగా టెండర్ను ఆహ్వానించింది. ఈ వార్త బయటకు రావడంతో శుక్రవారం నాటి ట్రేడింగ్లో కంపెనీ షేరు విలువ 4 శాతం మేర పెరగడం గమనార్హం. ఇదే సమయంలో ప్రయాణికుల వ్యక్తిగత డేటా గోప్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశంలో ఐఆర్సీటీసీ ఒక్కటే దేశంలో రైల్వే టికెట్లను విక్రయిస్తోంది. దాదాపు 80 శాతం టికెట్లు ఐఆర్సీటీసీ వేదికగా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రయాణికుల వివరాలతో పాటు, ప్రయాణికుల లావాదేవీల వివరాలు ఐఆర్సీటీసీ వద్ద నిక్షిప్తమై ఉన్నాయి. ఈ డిజిటల్ ఆస్తులను వినియోగించుకుని అదనపు ఆదాయం సమకూర్చుకొనేందుకు తాజాగా ఇ-టెండర్ను ఆహ్వానించింది. ఈ టెండర్ ఆధారంగా మానిటైజ్ ప్రక్రియపై అధ్యయనం చేయడానికి ఓ కన్సెల్టెంట్ను నియమించుకోనుంది. ఆగస్టు 29న చివరి తేదీగా పేర్కొంది.
ప్రయాణికుల డేటాతో ఏం చేస్తారు?
రైల్వే వద్ద పెద్ద ఎత్తున డేటా కలిగి ఉండటంతో అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి అవకాశాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయని ఐఆర్సీటీసీ భావిస్తోంది. కస్టమర్/వెండర్ అప్లికేషన్ల డేటాను మానిటైజ్ చేయాలనుకుంటున్నట్లు తన టెండర్ నోటీసులో పేర్కొంది. అదనపు ఆదాయం సంపాదించడంతో పాటు సేవలను మరింత మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఈ డేటాతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్, హోటల్స్, ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, వైద్య సంస్థలతో వ్యాపారం చేయనున్నట్లు ఐఆర్సీటీసీ పేర్కొంది. ఉదాహరణకు క్యాబ్ బుకింగ్ సంస్థలతో ఈ డేటాను పంచుకుంటే.. ప్రయాణికులకు ఆయా సంస్థలు తమ క్యాబ్ను బుక్ చేసుకోవాలని నోటిఫికేషన్ పంపించే అవకాశం ఉంటుంది.
మరి గోప్యత మాటేంటి?
రైల్వేలో రోజుకు సుమారు 11 లక్షలకు పైగా టికెట్లు విక్రయమవుతాయి. రోజూ 60 లక్షల మంది ఐఆర్సీటీసీలో లాగిన్ అవుతారు. ఈ లెక్కన దాని వద్ద ఏ స్థాయిలో డేటా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ డేటాను ఎలా మానిటైజ్ చేయాలన్నదానిపై ఎంపికైన కన్సెల్టెంట్ సంస్థలు ఐఆర్సీటీసీకి సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. డేటా ప్రైవసీకి సంబంధించి ఐటీ యాక్ట్- 2000, దాని సవరణలు, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ -2018తో పాటు సుప్రీం కోర్టు ఆదేశాలకు లోబడి ఈ కన్సల్టెంట్ సంస్థలు ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల డేటా గోప్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే అవుతుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
ఇన్నేళ్లుగా ఐఆర్సీటీసీ వద్ద పెద్ద మొత్తంలో ప్రయాణికుల వివరాలు ఉన్నా.. వాటిని దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. ఒకసారి మానిటైజ్ పేరుతో థర్డ్ పార్టీ చేతికెళ్తే దుర్వినియోగం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (IFF) సైతం తాజాగా ఆందోళన వ్యక్తంచేసింది. గతంలో వాహన్ డేటా బేస్లో ఉన్న రిజిస్ట్రేషన్ వివరాలను దిల్లీలో లక్షిత దాడులకు వినియోగించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. వాణిజ్య ప్రయోజనాల కంటే ముందు పౌరుల హక్కులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా సూచించింది. అయితే, ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రాథమిక దశలోనే ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మరి ఐఆర్సీటీసీ దీనిపై స్పష్టతనిస్తుందో లేదో చూడాలి. 2019లో సైతం ఐఆర్సీటీసీ డిజిటల్ ఆస్తుల మానిటైజ్ గురించి ఆసక్తి వ్యక్తీకరణకు టెండర్ను ఆహ్వానించి.. ఎందుకనో వెనక్కి తగ్గింది.
#Update
వెనక్కి తగ్గిన ఐఆర్సీటీసీ
ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్ డేటాను మానిటైజ్ చేయాలని భావించిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).. తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. వ్యక్తిగత డేటా గోప్యతపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రమంలో ఈ ప్రక్రియ కోసం ఇటీవల ఓ కన్సెల్టెంట్ను నియమించుకునేందుకు ఆహ్వానించిన టెండర్ను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటయిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఐఆర్సీటీసీ అధికారులు ఇదే విషయాన్ని తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు