IRM Energy IPO: ఐపీఓకి ఐఆర్ఎం ఎనర్జీ దరఖాస్తు.. రూ.700 కోట్ల సమీకరణ లక్ష్యం!
గుజరాత్, తమిళనాడు, పంజాబ్లో గ్యాస్ పంపిణీ నెట్వర్క్ ఉన్న ఐఆర్ఎం ఎనర్జీ ఐపీఓకి సన్నాహాలు చేసుకుంటోంది.
దిల్లీ: పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ పంపిణీ చేసే సంస్థ ‘ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్’ ఐపీఓ (IRM Energy IPO)కి రానుంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ (SEBI)కి శుక్రవారం ప్రాథమిక పత్రాలు సమర్పించింది. మొత్తం రూ.700 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓలో 1.01 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు.
అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఆర్ఎం ఎనర్జీ (IRM Energy IPO) ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్లో 20 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు యోచిస్తోంది. ఒకవేళ అదే జరిగితే పబ్లిక్ (IPO) ఇష్యూ పరిమాణం తగ్గనుంది. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రమోటర్లకు 67.94 శాతం వాటా ఉంది. 49.50 శాతం వాటాతో క్యాడిలా ఫార్మా అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతోంది. మిగిలిన వాటాలు ఐఆర్ఎం ట్రస్ట్ లిమిటెడ్ వద్ద ఉన్నాయి.
తాజా ఐపీఓ (IPO) ద్వారా సమీకరించిన నిధులను తమిళనాడులోని నమక్కల్, తిరుచిరాపల్లిలో గ్యాస్ పంపిణీ నెట్వర్క్ను విస్తరించేందుకు కావాల్సిన మూలధన అవసరాలకు వినియోగించనున్నారు. మరికొన్ని నిధులను రుణాల చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కూడా ఉపయోగించనున్నారు. ఈ కంపెనీ ‘పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)’ ‘కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)’ను పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేస్తుంటుంది. గుజరాత్, పంజాబ్, తమిళనాడులో దీని నెట్వర్క్ విస్తరించి ఉంది. 168 పారిశ్రామిక, 202 వాణిజ్య, 43183 గృహ వినియోగదారులకు ఇది గ్యాస్ను సరఫరా చేస్తోంది.
2022 సెప్టెంబరు నాటికి ఈ కంపెనీకి 56 సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో రెండింటిని ఐఆర్ఎం ఎనర్జీ సొంతంగా నిర్వహిస్తోంది. మిగిలిన వాటిలో 30 డీలర్లు, 24 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో వార్షిక ప్రాతిపదికన కంపెనీ ఆదాయం రెండింతలు పెరిగి రూ.504.12 కోట్లకు చేరింది. PAT ఆదాయం 17.91 శాతం తగ్గి 39.25 కోట్లకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీఓబీ క్యాపిటల్ మార్కెట్స్ ఈ ఐపీఓకి లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.