Steel Man of India: ‘స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ ఇకలేరు
టాటా స్టీల్తో సుదీర్ఘ అనుబంధం ఉన్న జంషేడ్ జె ఇరానీ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచారు.
జంషేడ్పూర్: ‘స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన జంషేడ్ జె ఇరానీ (85) సోమవారం రాత్రి కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన జంషేడ్పూర్లోని టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు టాటా స్టీల్ యాజమాన్యం ప్రకటించింది. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన సేవల్ని గుర్తించిన ప్రభుత్వం 2007లో పద్మభూషణ్తో సత్కరించింది.
టాటా స్టీల్తో జె.జె.ఇరానీకి 40 ఏళ్ల అనుబంధం ఉంది. కంపెనీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఆయన 2011 జూన్లో పదవీ విరమణ పొందారు. 1936 జూన్ 2న నాగ్పూర్లో జీజీ ఇరానీ, ఖోర్షెడ్ ఇరానీ దంపతులకు జంషేడ్ ఇరానీ జన్మించారు. నాగ్పూర్ సైన్స్ కాలేజ్లో 1956లో బీఎస్సీ పూర్తి చేశారు. 1958లో నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి జియాలజీలో ఎంఎస్సీ పట్టా పొందారు. అనంతరం ఆయన యూకేలోని షెఫీల్డ్ వర్సిటీకి జేఎన్ టాటా స్కాలర్గా వెళ్లారు. అక్కడ 1960లో మెటాలర్జీలో మాస్టర్స్ పూర్తిచేశారు. తర్వాత అదే సబ్జెక్టులో 1963లో పీహెచ్డీ పూర్తి చేశారు. తొలుత అక్కడే బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్లో కొంతకాలం ఉద్యోగం చేశారు.
భారత్పై ఉన్న ప్రేమతో స్వదేశానికి తిరిగొచ్చిన జె.జె.ఇరానీ అప్పటి ‘టాటా ఐరన్ అండ్ స్టీల్ (ఇప్పుడు టాటా స్టీల్)’లో చేరారు. తొలుత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం డైరెక్టర్కు అసిస్టెంట్గా పనిచేశారు. 1978లో జనరల్ సూపరింటెండెంట్గా, 1979లో జనరల్ మేనేజర్గా, 1985లో అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. తర్వాత 1988లో టాటా స్టీల్ జాయింట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 1992లో ఎండీగా బాధ్యతలు స్వీకరించి 2011లో రిటైరయ్యే వరకు ఆ పదవిలో కొనసాగారు. 1981లో ఆయన టాటా స్టీల్ బోర్డులో చేరారు. 2001 నుంచి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దశాబ్దం పాటు సేవలందించారు. టాటా సన్స్, టాటా మోటార్స్, టాటా టెలీసర్వీసెస్ సంస్థలకూ ఆయన డైరెక్టర్గా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’