Japan: భారత్లో జపాన్ ₹3.2లక్షల కోట్ల పెట్టుబడులు?
నేడు మన దేశ పర్యటనకు రానున్న జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా భారత్లో భారీ ఎత్తున పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం....
దిల్లీ: నేడు మన దేశ పర్యటనకు రానున్న జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా భారత్లో భారీ ఎత్తున పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వచ్చే ఐదేళ్లలో దాదాపు ఐదు ట్రిలియన్ యెన్ల (సుమారు రూ.3.20లక్షల కోట్లు) పెట్టుబడుల్ని ప్రకటించే అవకాశం ఉందని జపాన్కు చెందిన ఓ ప్రముఖ పత్రిక శనివారం ప్రచురించింది. 2014లో అప్పటి ప్రధాని షింజో అబే ప్రకటించిన 3.5 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులకు ఇవి అదనమని పేర్కొంది.
భారత్లో పట్టణ మౌలిక సదుపాయాలు సహా బుల్లెట్ రైలు సాంకేతికత ఆధారిత వేగవంతమైన రైల్వే ప్రాజెక్టులకు జపాన్ ఇప్పటికే సహకారం అందిస్తోంది. భారత్లో ప్రత్యక్ష మార్గంలో పెట్టుబడులను పెంచే యోచనలో కిషిదా ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. భారత్లోని జపాన్ కంపెనీల విస్తరణనూ చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోందని వివరించాయి. 300 బిలియన్ యెన్ల రుణం, కర్బనరహిత ఇంధన స్వయంసమృద్ధిలో సహకారం వంటి వాటిపైనా ఈ పర్యటనలో కిషిదా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటనలో రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, క్వాడ్ దేశాల భద్రతాపరమైన అంశాలూ చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ