Indigo-Jet Airways: ప్రయాణికుడితో వాగ్వివాదం.. ఇండిగో సిబ్బందికి జెట్ఎయిర్వేస్ సీఈవో మద్దతు!
ఫ్లైట్లో ప్రయాణికుడికి, సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకున్న ఘటనలో సిబ్బందికి మరో విమానయాన సంస్థ సీఈవో మద్దతుగా ట్వీట్ చేయడం వైరల్గా మారింది.
దిల్లీ: విమానం ఆలస్యం అయిందనో.. సిబ్బంది తీరు సరిగా లేదనో.. పలు సందర్భాల్లో విమానయాన సంస్థలపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తుంటారు. కొన్నిసార్లు విమానం గాల్లో ఉన్నప్పుడే ప్రయాణికులు, సిబ్బందికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంటుంది. ఇలాంటి సందర్బాల్లో విమానయాన సంస్థలు సిబ్బంది తీరునే తప్పుబడతాయి. కానీ, ఇందుకు భిన్నంగా ఒక విమానయాన సంస్థ సిబ్బందికి మరో విమానయాన సంస్థ సీఈవో మద్దతు పలికిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఫ్లైట్ సిబ్బంది కూడా మనుషులే అనే విషయాన్ని గుర్తించాలని జెట్ ఎయిర్వేస్ సీఈవో చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఈ నెల 16న ఇస్తాంబుల్ నుంచి దిల్లీకి వస్తోన్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. తాను కోరిన ఆహారం అందించలేదని ఎయిర్హోస్టెస్పై ఆగ్రహం వ్యక్తంచేశాడు. దానికి ప్రతిగా ఎయిర్హోస్టెస్ సైతం ధీటుగా బదులిస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. ‘‘ మీరు వేలు చూపుతూ మాపై ఎందుకు అరుస్తున్నారు. మీ వల్ల మా సిబ్బంది బాధపడుతున్నారు. టికెట్లో మీరు అందించిన వివరాల ప్రకారమే మీకు ఆహారం అందిస్తున్నాం’’ అని ఎయిర్హోస్టెస్ చెప్పేందుకు ప్రయత్నిస్తుండంగా.. ప్రయాణికుడు ‘‘నాపై ఎందుకు అరుస్తున్నారు? మీరు సర్వెంట్లు’’ అని అనడంతో.. ‘‘నేను మీకు సర్వెంట్ కాదు. ఉద్యోగిని. మాతో మీరు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదు’’ అని బదులిచ్చినట్టుగా వీడియోలో రికార్డయింది. ఇంతలో మరో ఎయిర్హోస్టెస్ వచ్చి అక్కడి నుంచి ఆమెను పక్కకు తీసుకెళ్తుంది. ఈ వ్యవహారం మొత్తాన్ని విమానంలోని ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.
ఈ వీడియోపై జెయిర్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ ట్విటర్లో స్పందించారు. ‘‘ నేను గతంలో చెప్పినట్లు విమానసిబ్బంది కూడా మనుషులే. ఆమెను ఎంతో ఆవేదనకు గురిచేస్తే తప్ప ఇలా వ్యవహరించదు. విమాన సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం, వారిపై దాడి చేయడం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఆమెను సర్వెంట్ అని పిలవడం దారుణం. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని భావిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. సంజీవ్ కపూర్ ట్వీట్ చూసిన నెటిజన్లు ఎయిర్హోస్టెస్కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమాఅందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా