Ethanol blended petrol: ఈ బంకుల్లో ఇకపై 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్
e20 blended petrol: 20 శాతం ఇథనాల్ను కలిపిన పెట్రోల్ను తమ చమురు పంపుల వద్ద విక్రయించనున్నట్లు జియో-బీపీ వెల్లడించింది.
దిల్లీ: పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపిన చమురు ఇకపై తమ పెట్రోల్ పంపుల వద్ద లభ్యమవుతుందని జియో-బీపీ (Jio-bp) వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, యూకేకి చెందిన బీపీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా 20 శాతం ఇథనాల్ కలిపిన ఈ20 (E20 petrol) పెట్రోల్ను విక్రయిస్తున్న తొలి రిటైలర్ తామేనని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ముడి చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడంలో భాగంగా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాలు కలిపిన చమురును ఈ20గా వ్యవహరిస్తారు. ఎంపిక చేసిన జియో-బీపీ పెట్రోల్ పంపుల వద్ద ఈ20 పెట్రోల్ అందుబాటులో ఉంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. వాహనదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది. త్వరలో మరిన్ని పంపుల్లో ఈ20 పెట్రోల్ను అందుబాటులో ఉంచుతామని తెలిపింది. రిలయన్స్, బీపీ సంస్థలు ఏర్పాటు చేసిన ఈ జాయింట్ వెంచర్కు దేశవ్యాప్తంగా 1510 పెట్రోల్ పంపులు ఉన్నాయి.
చెరకు, బియ్యం నూకలు, ఇతర ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ను తీస్తారు. చమురు దిగుమతుల వ్యయాన్ని తగ్గించడంతో పాటు, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇథనాల్ను కలిపే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల రైతుల ఆదాయం సైతం పెరుగుతుందని చెబుతోంది. దశలవారీగా ఇథనాల్ను కలిపే శాతాన్ని పెంచుతూ వస్తున్న భారత్.. తాజాగా 20 శాతానికి తీసుకొచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
-
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!