JioFiber: జియోఫైబర్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..అదనంగా మరో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌

జియోఫైబర్‌ తమ వినియోగదారులకు ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఓటీటీలతో కూడిన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ తీసుకున్నవారికి కొత్తగా యూనివర్సల్‌‌+ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా జత చేసింది....

Published : 05 Jun 2022 13:28 IST

ముంబయి: జియోఫైబర్‌ తమ వినియోగదారులకు ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఓటీటీలతో కూడిన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ తీసుకున్నవారికి కొత్తగా యూనివర్సల్‌‌+ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా జత చేసింది. అయితే, దీని స్థానంలో మరో ఓటీటీని తొలగించడం లేదని స్పష్టం చేసింది. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన బేస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ రూ.999లోనూ కొత్త ఓటీటీ సర్వీసుని పొందొచ్చని తెలిపింది. జియో ఫైబర్‌ ఓటీటీ ప్లాన్లను ప్రవేశపెట్టినప్పుడు యూనివర్సల్‌+ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ వాటిలో లేదు. దీన్ని ఇప్పుడే కొత్తగా ప్రవేశ పెట్టారు. 

మెరుగైన బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల్ని అందిస్తున్న కంపెనీల్లో జియోఫైబర్‌ ఒకటి. ఓటీటీలతో కూడిన జియో ఫైబర్‌ ప్లాన్లను తీసుకుంటే సెటాప్‌ బాక్స్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉంది. దీంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ను కేవలం స్మార్ట్‌టీవీలోనే కాకుండా సెటాప్‌ బాక్స్‌ ద్వారా సాధారణ టీవీలోనూ వీక్షించొచ్చు. రూ.999 బేస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌తో ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ సహా మొత్తం 16 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని