JP Morgan: భారత బాండ్లలోకి రానున్న రూ.లక్షల కోట్లు.. కీలక సూచీలో చోటుతో మార్గం సుగమం!
Emerging Markets Bond Index: భారత బాండ్లపై అంతర్జాతీయంగా ఆదరణ పెరగనుంది. జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ బాండ్ ఇండెక్స్లో భారత ప్రభుత్వ బాండ్లకు చోటు దక్కనుంది. దీంతో బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత్కు రానున్నాయి.
Emerging Markets Bond Index | దిల్లీ: జేపీ మోర్గాన్ కీలక సూచీల్లో ఒకటైన ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ (Emerging Markets Bond Index)లో భారత ప్రభుత్వ బాండ్లు చేరనున్నాయి. ఫలితంగా భారత బాండ్ మార్కెట్లోకి బిలియన్ డాలర్ల నిధులు వచ్చే అవకాశం ఉంది. 2024 జూన్ 28 నుంచి ఈ ఇండెక్స్లో భారత్ కనిపించనుంది. దాదాపు 10 శాతం వెయిటేజీ ఉండొచ్చని సమాచారం.
ఆర్థిక వృద్ధికి నిదర్శనం..
భారత ఆర్థిక వృద్ధి ఇప్పుడు ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో విదేశీ మదుపర్లు, కంపెనీలు మన దేశంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తాజా జేపీ మోర్గాన్ నిర్ణయమే ఒక నిదర్శనం. భౌగోళిక రాజకీయాల్లో, వివిధ కీలక అంతర్జాతీయ వేదికలపైనా భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు భారత్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో చైనా నుంచి బయటకు రావాలనుకుంటున్న కంపెనీలన్నీ భారత్ను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు భారత బాండ్ మార్కెట్లో విదేశీ మదుపర్ల వాటా చాలా పరిమితంగా ఉంటూ వచ్చింది. గత కొన్నేళ్లుగా మాత్రం క్రమంగా పుంజుకుంటోంది. కరోనా, ఆ తర్వాత పరిణామాల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడమే దీనికి ఓ కారణం. పైగా ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది.
బిలియన్ల డాలర్ల పెట్టుబడులు..
జేపీ మోర్గాన్ తాజా నిర్ణయం వల్ల 2025 మార్చి నాటికి 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది భారత బాండ్లలోకి విదేశీ మదుపర్లు 3.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. ఈక్విటీ మార్కెట్లలో ఇప్పటికే విదేశీయులు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇతర వర్థమాన దేశాలతో పోలిస్తే భారత్ ఆర్థికంగా పటిష్ఠంగా ఉండడమే ఇందుకు కారణం. ద్రవ్యోల్బణం కూడా క్రమంగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత బాండ్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
మెరుగుపడుతున్న అవకాశాలు..
అంతర్జాతీయ సూచీల్లో భారత్ చేరికకు ఇటీవల అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇండెక్స్ జారీ సంస్థలు తమ సూచీలను విస్తరించాలనుకోవడం దీనికి ఒక కారణం. అలాగే ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాను అనేక సూచీల నుంచి పక్కన పెట్టారు. మరోవైపు కఠిన ఆంక్షలు, వివిధ దేశాలతో వివాదాలు, ఆర్థిక ఒడుదొడుకుల నేపథ్యంలో చైనా ఆకర్షణ కోల్పోయింది. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ముందున్న భారత్కు అవకాశాలు మెరుగుపడ్డాయి. తాజా జేపీ మోర్గాన్ నిర్ణయంతో దాదాపు 330 బిలియన్ డాలర్ల విలువ చేసే 23 బాండ్లు ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ (Emerging Markets Bond Index)లో చోటు దక్కించుకోనున్నాయి. ఈ చర్యను ముందుగానే పసిగట్టిన విదేశీ మదుపర్లు ఆయా బాండ్లలో తమ పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటూ వస్తున్నారు. 2022 చివరి నాటికి 7.4 బిలియన్ డాలర్లుగా ఉన్న వారి పెట్టుబడుల విలువ ప్రస్తుతం 12 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జై.. జీడీపీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీ, గనులు, సేవల రంగం మెరుగ్గా రాణించడంతో ఇది సాధ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. -
అత్యంత విలువైన అంకురాలు @ బెంగళూరు
స్వయం కృషితో ఎదిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన అత్యంత విలువైన కంపెనీలకు అతిపెద్ద కేంద్రస్థానంగా భారత సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు నిలిచింది. -
పీవీఆర్ ఐనాక్స్ రూ.500 కోట్ల పెట్టుబడులు
దేశీయంగా అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్గా కొనసాగుతున్న పీవీఆర్ ఐనాక్స్, వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో మరో 150 కొత్త తెరలను ప్రారంభించాలనుకుంటోంది. -
అల్ట్రాటెక్ చేతికి కేశోరామ్ సిమెంట్
బి.కె.బిర్లా గ్రూపు ప్రధాన సంస్థ కేశోరామ్ ఇండస్ట్రీస్కు చెందిన సిమెంట్ వ్యాపారాన్ని ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయనుంది. షేర్ల బదిలీ (స్వాప్) రూపేణా ఈ కొనుగోలు లావాదేవీ జరగనుందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. -
పిల్లలకు ఆర్థిక భద్రత..
యూనియన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా యూనియన్ చిల్డ్రన్ ఫండ్ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. కానీ, కనీసం అయిదేళ్లపాటు లేదా మైనర్ పిల్లలు మేజర్ అయ్యే వరకూ లాకిన్ నిబంధన వర్తిస్తుంది. -
ప్రయాణ బీమా..క్లెయిం చేసుకోవాలంటే...
-
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్తో బోట్ గేమింగ్ ఇయర్బడ్స్
Boat earbuds: సింగిల్ ఛార్జ్తో 50 గంటల ప్లేబ్యాక్ టైమ్తో బోట్ ఇయర్బడ్స్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. -
నెలకు రూ.8 వేలతో రూ.5 కోట్లు
నా వయసు 34. ప్రైవేటు ఉద్యోగిని. ఆరేళ్ల మా అమ్మాయి భవిష్యత్ కోసం నెలకు రూ.15 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
పన్ను ప్రణాళిక ఆర్థిక లక్ష్యం నెరవేరేలా...
ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఇప్పటికే చాలామందికి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) ప్రారంభమయ్యింది. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన పెట్టుబడులను ఎంచుకోవాలి -
ఆదాయం.. బీమా రక్ష జీవితాంతం..
బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పొదుపు, బీమాతోపాటు, హామీతో కూడిన ఆదాయాన్ని అందించేలా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. అదే జీవన్ ఉత్సవ్. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవితాంతం వరకూ బీమా రక్షణ అందించే పాలసీ. -
మదుపరి పంట పండింది
ఐపీఓ.. ఐపీఓ.. ఐపీఓ.. గత వారం రోజులుగా స్టాక్మార్కెట్ మదుపర్ల చర్చ అంతా వీటి మీదే. ఇందుకు తగ్గట్టుగానే టాటా టెక్నాలజీస్ సహా ఇతర కంపెనీల ఐపీఓలు లాభాల పంట పండించి,. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాయి. భారీ నమోదు లాభాలను పంచి, మదుపర్లను మురిపించాయి. -
Gold Loan: అత్యవసరంలో పసిడి రుణం..
వ్యక్తిగత రుణాలకు నిబంధనలు కఠినతరం అవడంతో అప్పు దొరకడం కాస్త కష్టమవుతోంది.అత్యవసర సందర్భాల్లో ఉన్న సులువైన మార్గం బంగారంపై రుణం తీసుకోవడం. ఈ నేపథ్యంలో ఈ అప్పు తీసుకునేటప్పుడు ఏం చూడాలి? అనే అంశాలను తెలుసుకుందాం. -
గృహ విక్రయాలు 22% పెరిగాయ్!
దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో జులై-సెప్టెంబరు త్రైమాసికంలో గృహ విక్రయాలు 22 శాతం పెరిగాయని స్థిరాస్తి డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రోప్ టైగర్.కామ్ వెల్లడించింది. వినియోగదారు గిరాకీ బాగుందని తెలిపింది. -
ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ జాబితాలో నందన్ నీలేకని, నిఖిల్ కామత్
ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ జాబితాలో ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ ఛైర్మన్ కె.పి.సింగ్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్కు చోటు లభించింది. -
అత్యంత విలాసవంత గృహాల విక్రయాలు 4 రెట్లు పెరిగాయ్
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు అల్ట్రా-లగ్జరీ (అత్యంత విలాసవంత) గృహాల విక్రయాలు 4 రెట్లు పెరిగి 58కి చేరాయని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. -
ముడి చమురు 80 డాలర్ల దిగువకు వస్తేనే రిటైల్ ధరల సవరణ!
అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్కు 80 డాలర్ల దిగువన స్థిరపడితేనే, ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను రోజువారీగా సవరిస్తాయని అధికారులు వెల్లడించారు. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు నమోదుచేశాయి. నవంబరు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. -
అరబిందో ఔషధానికి అమెరికాలో అనుమతి
బుడెసొనైడ్ ఇన్హలేషన్ సస్పెన్షన్ ఔషధాన్ని అమెరికాలో విడుదల చేయడానికి అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ అయిన యూగియా ఫార్మా స్పెషాలిటీస్కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి లభించింది. -
వర్ల్పూల్ ఆఫ్ ఇండియాలో 24% వాటా విక్రయించనున్న వర్ల్పూల్
అమెరికాకు చెందిన గృహోపకరణాల దిగ్గజ సంస్థ వర్ల్పూల్ కార్పొరేషన్ భారత్లోని తన అనుబంధ సంస్థ వర్ల్పూల్ ఆఫ్ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉంది. -
అక్టోబరులో కీలక రంగాల వృద్ధి 12.1%
అక్టోబరులో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 12.1 శాతం పెరిగింది. కిందటేడాది ఇదే సమయంలో వృద్ధి 0.7 శాతంగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
-
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు