Budget 2023: మేడమ్..! ఇల్లు కట్టుకుంటాం కాస్త కరుణిస్తారా?
Budget 2023: కొత్త బడ్జెట్పై సామాన్యులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా వడ్డీరేట్లు పెరిగిన నేపథ్యంలో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారి కోసం ఎలాంటి ప్రకటనలు ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు బలపడుతున్నాయి. భౌగోళిక రాజకీయ అస్థిరతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ (Budget 2023)ను ప్రవేశపెట్టబోతోంది. పైగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ (Budget 2023). ఈ నేపథ్యంలో వివిధ రంగాలు కొత్త పద్దుపై ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్న అనేక మంది స్థిరాస్తి పరిశ్రమకిచ్చే ప్రోత్సాహకాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2022లో ఇళ్ల విక్రయాలు 50 శాతం పుంజుకున్నాయి. అందుబాటు ధరలో ఇళ్లు, ఆరంభంలో తక్కువ వడ్డీరేటు వద్ద రుణాలు, కొవిడ్ ప్రభావం నుంచి తేరుకున్న వర్గాల నుంచి గిరాకీ వంటి మిశ్రమ వాతావరణం నేపథ్యంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ గతేడాది గణనీయంగా పుంజుకుంది. ఈ జోరును ఇలాగే కొనసాగించి.. సామాన్యుల సొంతింటి కలను నిజం చేయాలంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ (Budget 2023)లో పలు ప్రోత్సాహకాలు ప్రకటించాలని నిపుణులు కోరుతున్నారు.
గృహరుణ అర్హతల సులభతరం..
ద్రవ్యోల్బణం మంటను తగ్గించడానికి ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచుతోంది. కానీ, అది గృహ రుణ (Home Loan) గ్రహీతలకు మాత్రం భారంగా మారింది. నెలవారీ కిస్తీలు పెరిగి సామాన్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కొత్తగా రుణం తీసుకొని ఇల్లు కొనాలనుకునేవారు (Homebuyers) తమ ప్రణాళికల్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రుణ అర్హతల్లో కొన్ని సడలింపులు చేయాల్సిన అవసరం ఉందని స్థిరాస్తి నిపుణులు కోరుతున్నారు. బ్యాంకులు ప్రస్తుతం మార్కెట్ విలువపై 80 శాతం వరకు రుణాన్ని మంజూరు చేస్తున్నాయి. ఈ మొత్తాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు. దీనికితోడు అర్హత ప్రక్రియను సులభతరం చేయడం వంటి ఇతర నిర్ణయాలు బడ్జెట్లో ప్రతిపాదించాలని సామాన్యులు కోరుతున్నారు.
వడ్డీపై రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు..
ప్రస్తుతం ఇళ్ల కొనుగోలుదారు (Homebuyers)లు గృహరుణం (Home Loan)పై చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల పై పన్ను మినహాయింపు పొందుతున్నారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద ఈ వెసులుబాటును పొందుతున్నారు. 2016- 17 నుంచి ఈ పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఈ లిమిట్ను రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
గృహరుణానికి ప్రత్యేక ‘80సీ’..
వడ్డీతో పాటు గృహరుణ (Home Loan) అసలుపై కూడా సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. అయితే, సెక్షన్ 80సీ ఇతర పెట్టుబడులుకు కూడా ఇది వర్తిస్తుంది. గృహరుణ అసలు మొత్తంతో పాటు వాటిని కూడా కలిపి రూ.1.5 లక్షలపై వరకు మినహాయింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో 80సీ మినహాయింపును ఇతర పెట్టుబడులను నుంచి వేరుచేసి గృహరుణ (Home Loan) అసలుపై ప్రత్యేక మినహాయింపునివ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
ఆ మొత్తం రూ.75 లక్షల వరకు..
ప్రస్తుతం రూ.45 లక్షలు అంతకంటే తక్కువ విలువ చేసే ఇళ్లను అందుబాటు ధరలో ఇళ్ల (అఫర్డబుల్ హౌసింగ్) కేటగిరీ కింద పరిగణిస్తున్నారు. వీరికి ప్రత్యేకంగా కొన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారు. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకొని రూ.45 లక్షల పరిమితిని రూ.75 లక్షల వరకు పెంచడం ద్వారా మరింత మందికి ప్రయోజనం చేకూరుతుందని స్థిరాస్తి వర్గాలు చెబుతున్నాయి.
దీర్ఘకాల మూలధన లాభాలపై ఉపశమనం..
ప్రస్తుతం ఉన్న ఇంటిని విక్రయించడం వల్ల వచ్చిన దీర్ఘకాల మూలధన లాభాలను ఆదాయ పన్ను (Income Tax) చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం కొత్త ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణానికి వినియోగించొచ్చు. ఆ డబ్బుతో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూడా కొనుగోలు చేయొచ్చు. అయితే, దాని నిర్మాణం మూడేళ్లలోగా పూర్తయితేనే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ప్రస్తుత ప్రాజెక్టుల నిర్మాణ కార్యకలాపాలో వివిధ కారణాల వల్ల జాప్యం చోటు చేసుకొంటున్న నేపథ్యంలో ఈ కాలపరిమితిని ఐదేళ్లకు పొడిగించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.
జీఎస్టీ మినహాయింపులు..
ప్రస్తుతం స్టీల్పై 18 శాతం, సిమెంట్పై 28 శాతం జీఎస్టీ (GST) కొనసాగుతోంది. దీంతో నిర్మాణ వ్యయాలు పెరిగి ఆ భారాన్ని కొనుగోలుదారుల (Homebuyers)పై మోపాల్సి వస్తోందని స్థిరాస్తి వర్గాలు తెలిపాయి. ఫలితంగా ధరలు పెరిగి కొనుగోలు చేయడానికి ప్రజలు ముందుకు రావడం లేదని వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని కోరుతున్నారు. మరోవైపు వీటిపై చెల్లించిన పన్నును రీయింబర్స్ చేసుకోవడానికి ‘ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)’ను తిరిగి ప్రవేశపెట్టాలనే డిమాండ్ కూడా డెవలపర్ల నుంచి వినిపిస్తోంది.
పీఎంఏవైకి అధిక కేటాయింపులు..
భారత్లో సామాన్యుల సొంతింటి కలను నిజం చేయడంలో ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY)’ వంటి పథకాలు కీలక పోషిస్తున్నాయని ‘ఇక్రా’ ఇటీవల ఓ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం దాదాపు 4.6 లక్షల ఇళ్లకు ఈ పథకం కింద ప్రోత్సాహకాలు అందించాల్సి ఉందని ఇక్రా తెలిపింది.
ల్యాండ్ బ్యాంక్ మానిటైజ్..
ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల వద్ద పెద్దఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉందని ఇక్రా తెలిపింది. దీన్ని మానిటైజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫలితంగా స్థిరాస్తి ప్రాజెక్టుల అభివృద్ధికి మరింత స్థలం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఫలితంగా గిరాకీ అనుగుణంగా నిర్మాణాలు జరుగుతాయని తెలిపింది. ధరల నియంత్రణకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?