Budget 2023: మోదీ సర్కారు ‘స్థిర’ నిర్ణయాలేమిటో..?
దేశంలో ఉద్యోగాలు, వ్యాపారాలను అత్యధికంగా ప్రభావితం చేసే రంగాల్లో రియల్ ఎస్టేట్ ఒకటి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రంగం కోరుతున్న డిమాండ్లు ఈ సారి పూర్తవుతాయని భావిస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: కొవిడ్ సమయంలో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో స్థిరాస్తి ఒకటి. లాక్డౌన కారణంగా కొన్ని నెలలపాటు నిర్మాణాలు నిలిచిపోయాయి. దశల వారీగా లాక్డౌన్ తొలగించే నాటికి చాలా మంది కూలీలు స్వగ్రామాలకు వలసపోయారు. దీంతో వెంటనే నిర్మాణాలు పునః ప్రారంభం కాలేదు. నెలలకొద్దీ కూలీల కొరత నెలకొంది. మెల్లగా 2022 నాటికి గృహ నిర్మాణాల విక్రయాలు అంతకు మందు ఏడాదితో పోలిస్తే 50 శాతం పుంజుకొన్నాయి. ఇప్పుడు 2023లో కూడా ఆ డిమాండ్ను కొనసాగించడం రియల్ ఎస్టేట్ రంగం ఎదుట నిలిచిన ముఖ్యమైన సవాల్. బడ్జెట్ 2023 (Budget 2023)లో కేంద్రం తీసుకొనే నిర్ణయాలపై స్థిరాస్తి రంగం అభివృద్ధి ఆధారపడి ఉంది.
బ్రోకరేజీ సేవలకు జీఎస్టీ రేటు క్రమబద్ధీకరణ..
కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ(GST), రెరాలు సానుకూల ప్రభావం చూపించాయి. కానీ, రియల్ ఎస్టేట్ బ్రోకరేజి వ్యవస్థకు సంబంధించి ఓ చిక్కుముడిని అపరిష్కృతంగా వదిలేశాయి. బ్రోకరేజీ రేట్లకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు, చట్టాలు లేవు. అందుకే ప్రతి లావాదేవీకి సంబంధించి కమిషన్ చెల్లించాల్సిన బాధ్యత కొనుగోలుదారు, డెవలపర్పై లేదు. ఈ నేపథ్యంలో బ్రోకరేజీపై విధించే 18 శాతం జీఎస్టీ వసూలు బాధ్యత రియల్టర్లపై పడుతోంది. చాలా మంది సొంత జేబు నుంచి ఈ మొత్తం చెల్లిస్తున్నారు. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సేవలను కూడా సాధారణ సర్వీసు ప్రొవైడర్ల వలే 5శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలి. దేశంలో దాదాపు 10 లక్ష మంది వరకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు వల్ల చాలా మంది పన్ను చెల్లించేందుకు ఇష్టపడతారు. రియల్టర్లపై భారం తగ్గడంతోపాటు.. ప్రభుత్వానికి కూడా పన్ను ఆదాయం పెరుగుతుంది.
కొనుగోలుదారుల సెంటిమెంట్ దెబ్బతినకుండా..
కొవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహం కోసం వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించడం రియల్ ఎస్టేట్ రంగానికి బాగా ఊతమిచ్చింది. గృహ రుణ వడ్డీరేట్లు బాగా తగ్గిపోయాయి. కానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ధరలను కట్టడి చేయడానికి వడ్డీరేట్లను గణనీయంగా పెంచాల్సి వచ్చింది. ఇది కొనుగోలుదారుల్లో ఆందోళన పెంచుతోంది. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లను స్థిరీకరించాలని రియల్ ఎస్టేట్ రంగం కోరుకుంటోంది. దీనివల్ల గృహరుణాలపై ఇళ్లు కొన్న వారికి పెద్దగా మార్పులు లేని ఈఎంఐలు ఉంటాయి. ఈ పరిస్థితి చాలా మంది మధ్యతరగతి వారు గృహాలు కొనుగోలు చేసేట్లు ప్రోత్సహిస్తుంది. తరచూ మారిపోయే వడ్డీ రేట్ల వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో స్పెక్యూలేషన్ చేసేవారికే ప్రయోజనం లభిస్తుంది గానీ.. నిజంగా ఇళ్ల కొనుగోలుదార్లకు కాదు.
రియల్ ఎస్టేట్కు పరిశ్రమ హోదా..
దేశ జీడీపీకి అత్యధిక ఆదాయం చేకూర్చే రెండో రంగం రియల్ఎస్టేట్. కానీ, ఇప్పటికీ ఇది అసంఘటిత రంగ హోదాలోనే ఉంది. ఇటీవల కాలంలో ప్రభుత్వం దీని నియంత్రణకు చాలా మార్పులు చేసింది. కానీ, పరిశ్రమ హోదా మాత్రం ఇవ్వలేదు. ఈ హోదా లభిస్తే పనులను మరింత వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా చేసే అవకాశం లభిస్తుంది. దీంతోపాటు బడ్జెట్లో రియల్ ఎస్టేట్ విద్యను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు నైపుణ్యం పెంచే కార్యక్రమాలు, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్కు శిక్షణ వంటివి నిర్వహించవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్లో ఈ రంగం మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు.. చాలా మంది యువత ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు దోహదం చేస్తుంది.
ప్రాజెక్టు ఫైనాన్సింగ్కు ప్రభుత్వ సాయం..
ప్రస్తుతం ప్రాజెక్టు డెవలపర్లు కూడా దాదాపు 6-8శాతం మధ్య వడ్డీరేట్లకు రుణాలను తీసుకొంటున్నారు. ఇది గృహ రుణాల రేటుతో దాదాపు సమానంగా ఉంటోంది. ప్రభుత్వం ప్రాజెక్టు ఫైనాన్సింగ్ రంగంలో జోక్యం చేసుకోవాలి. ప్రాజెక్టులకు అవసరమైన రుణాలను తక్కువ వడ్డీకే ఇవ్వాలని ఆర్బీఐకి కేంద్రం సూచించాలి. దీంతో ప్రాజెక్టు ఖర్చులు తగ్గించి అందుబాటు ధరల్లోనే ఇళ్లు వినియోగదారులకు లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం నీడలు కమ్ముకొన్న సమయంలో భారత్లో అతిపెద్ద రంగాల్లో ఒకటైన రియల్ ఎస్టేట్కు ఊతమివ్వాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM