Kia Sonet: 1.5 లక్షల మైలురాయిని దాటిన కియా సోనెట్ విక్రయాలు
కియా ఇండియా సెప్టెంబరు 2020లో తీసుకొచ్చిన ఎస్యూవీ సోనెట్ విక్రయాలు 1.5 లక్షల యూనిట్ల మైలురాయిని దాటినట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది....
దిల్లీ: కియా ఇండియా సెప్టెంబరు 2020లో తీసుకొచ్చిన ఎస్యూవీ సోనెట్ విక్రయాలు 1.5 లక్షల యూనిట్ల మైలురాయిని దాటినట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కంపెనీ మొత్తం కార్ల విక్రయాల్లో ఈ మోడల్దే 32 శాతం వాటా అని తెలిపింది. డిజైన్, పెర్ఫార్మెన్స్, ఐఎంటీ ఫెవరబిలిటీ విషయంలో సోనెట్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుందని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్లో కిందిస్థాయి వేరియంట్లలోనూ నాలుగు ఎయిర్బ్యాగ్లను ప్రామాణికం చేసినట్లు గుర్తుచేసింది. తద్వారా భద్రత విషయంలో మరింత మెరుగైనట్లు తెలిపింది. మొత్తం సోనెట్ విక్రయాల్లో టాప్ వేరియంట్ వాటా 26 శాతం కాగా, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 22 శాతం, డీజిల్ పవర్ట్రెయిన్ వాటా 41 శాతమని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!