Adani: కిడ్నాపర్ల చెర నుంచి.. ముంబయి పేలుళ్లలో బయటపడ్డ అదానీకి ఇప్పుడు మరో పెద్ద సవాల్!
అదానీ గ్రూపుపై ఇటీవల వచ్చిన ఆరోపణలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అపర కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ.. ప్రస్తుతం ఏడో స్థానానికి పడిపోయాడు.
దిల్లీ: కాలేజీ చదువుకు దూరమైనా.. చిన్నతనంలోనే వ్యాపారంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే సంపన్న వ్యక్తిగా ఎదిగారు. ఆ క్రమంలో కిడ్నాపర్లకు బందీగా మారి.. ముంబయి పేలుళ్ల నుంచీ తప్పించుకొని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. మూడున్నర దశాబ్దాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించుకున్న ఆయన.. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడ్డారు. ఇలా ప్రపంచంలోనే అపర కుబేరుల జాబితాలోకి చేరుకున్న గౌతమ్ అదానీ.. ప్రస్తుతం మరోసారి తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
3 నుంచి ఏడో స్థానానికి పడిపోయి..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి హిండెన్బర్గ్ రూపంలో అతిపెద్ద సవాల్ ఎదురవుతోంది. షేర్ల విలువ పతనం కావడంతో వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఆయన కంపెనీలు చవిచూస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే సుమారు రూ.లక్షన్నర కోట్లకుపైగా అదానీ సంపద ఆవిరయ్యింది. దీంతో ప్రపంచంలోనే అపరకుబేరుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న ఆయన.. ప్రస్తుతం ఏడో స్థానానికి పడిపోయారు.
వజ్రాల షాపులో పనిచేసి..
అహ్మదాబాద్లో ఓ జైన్ కుటుంబంలో జన్మించిన అదానీ.. కాలేజీ చదువును మధ్యలోనే మానేశారు. టీనేజర్గా ఉన్న సమయంలో ముంబయికు చేరుకున్న ఆయన.. వజ్రాల వ్యాపారి దగ్గర కొంతకాలం పనిచేశారు. అనంతరం 1981లో గుజరాత్కు తిరిగి చేరుకున్న అదానీ.. పీవీసీ ఫిల్మ్ ఫ్యాక్టరీని నడిపించారు. 1988లో అదానీ ఎక్స్పోర్ట్స్ పేరుతో విదేశాలకు ఎగుమతులు మొదలుపెట్టిన ఆయన.. 1994లో లిస్టెడ్ కంపెనీగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో అడుగుపెట్టి అదానీ ఎంటెర్ప్రైజెస్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
కిడ్నాపర్ల చెరలో బందీగా..
అదానీ వ్యాపారం విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో ఆయనకు అనూహ్య పరిణామం ఎదురయ్యింది. అదానీతోపాటు సహచరుడు శాంతీలాల్ పటేల్ కారులో వెళ్తున్న సమయంలో కొంతమంది దుండగులు వారిని అడ్డుకున్నారు. నుదుటన తుపాకీ పెట్టి వారిని అపహరించారు. ఫజ్లూ రెహ్మాన్, భోగీలాల్ డార్జీ (అలియాస్ మామా) అనే గ్యాంగ్స్టర్లు వారిని కిడ్నాప్ చేశారని.. సుమారు రూ.10కోట్లు డిమాండ్ చేసినట్లు చెబుతుంటారు. అయితే, వారికి ఆ నగదు చెల్లించారా లేదా అనే విషయం తెలియనప్పటికీ.. ఒకరోజు తర్వాత కిడ్నాపర్ల చెరనుంచి వారిద్దరూ విడులయ్యారు.
ముంబయి పేలుళ్ల ఘటనలో బయటపడి..
కిడ్నాపర్ల చెరనుంచి బయటపడిన అదానీకి మరోసారి మృత్యువు ఎదురొచ్చింది. 2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రదాడి సమయంలో తాజ్ హోటల్ల్లోనే ఉన్నారు. దుబాయ్ పోర్టు సీఈవో మొహమ్మద్ షరీఫ్తో భేటీ అయిన ఆయన.. బిల్లు చెల్లించి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతోన్న తరుణంలో ఉగ్రవాదులు తాజ్ హోటల్పై దాడులకు తెగబడి వందల మందిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 160మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ రాత్రి మొత్తం హోటల్ బేస్మెంట్లోనే గడిపిన ఆయన.. కమాండోలు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మరుసటి రోజు ఉదయం ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్న అదానీ.. ‘మృత్యువుని 15 అడుగుల దూరంలో చూశాను’ అని విలేకరులతో పేర్కొన్నారు.
వ్యాపారంలో..
నిత్యావసర వస్తువుల నుంచి 1988లో పోర్టు వ్యాపారంలోకి వచ్చిన అదానీ.. మళ్లీ తిరిగి వెనక్కి చూసుకోలేదు. అనతికాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ.. విద్యుత్, మైనింగ్, గ్యాస్, వంట నూనెల రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో అదానీ వ్యాపారం మరింత విస్తరణ జరిగిందనే విమర్శలు ఉన్నాయి. అనేక రంగాల్లో పెట్టుబడులతో ముందుకెళ్లిన అదానీ.. ఎయిర్పోర్టులు, సిమెంటుతోపాటు తాజాగా మీడియా రంగంలోకి ప్రవేశించారు. ఇలా ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచిన అదానీ.. ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో మూడోస్థానానికి చేరుకున్నారు.
వివాదాలు కొత్త కాదు..
అదానీ గ్రూపునకు వివాదాలు కొత్తేమీ కాదనే తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్లో ఏర్పాటు చేసిన బొగ్గు గని ప్రాజెక్టుపై అక్కడి పర్యావరణవేత్తల నుంచి అప్పట్లో వ్యతిరేకత ఎదురైంది. కేరళలో 900 మిలియన్ డాలర్లతో అదానీ గ్రూపు నిర్మిస్తున్న నౌకాశ్రయంపైనా మత్స్యకారులు ఆందోళనలు చేశారు. నాలుగు నెలలపాటు కొనసాగిన వ్యవహారం ఇటీవలే సమసిపోయింది.
తాజాగా హిండెన్బర్గ్ నివేదిక రూపంలో మరో భారీ సవాలును అదానీ గ్రూపు ఎదుర్కొంటోంది. షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ చేసిన ఆరోపణలు అదానీ గ్రూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అదానీ గ్రూపుతోపాటు స్టాక్ మార్కెట్లపైనా స్పష్టంగా కనిపించింది. ఇటువంటి సమయంలో తాజా సవాలును అదానీ అధిగమించి మదుపర్లలో ఎలా విశ్వాసం నింపుతారనే విషయంపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ఎలాన్ మస్క్కు చెందిన ‘ఎక్స్’ సిద్ధమవుతోంది. -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
Tesla: భారత్లోకి టెస్లా ప్రవేశం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. మంగళవారం చేసిన ఓ కీలక ప్రకటనే అందుకు కారణం. ఆ ప్రకటనేంటి? దానికీ.. కంపెనీ భారత ప్రణాళికలకు సంబంధం ఏంటో చూద్దాం! -
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
Anil Agarwal: తన దినచర్యను తెలపడంతో పాటు యువతకు ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు వేదాంత అధిపతి అనిల్ అగర్వాల్. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 దగ్గర కొనసాగుతోంది. -
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి