Adani: కిడ్నాపర్ల చెర నుంచి.. ముంబయి పేలుళ్లలో బయటపడ్డ అదానీకి ఇప్పుడు మరో పెద్ద సవాల్!
అదానీ గ్రూపుపై ఇటీవల వచ్చిన ఆరోపణలతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అపర కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ.. ప్రస్తుతం ఏడో స్థానానికి పడిపోయాడు.
దిల్లీ: కాలేజీ చదువుకు దూరమైనా.. చిన్నతనంలోనే వ్యాపారంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే సంపన్న వ్యక్తిగా ఎదిగారు. ఆ క్రమంలో కిడ్నాపర్లకు బందీగా మారి.. ముంబయి పేలుళ్ల నుంచీ తప్పించుకొని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. మూడున్నర దశాబ్దాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని భారీగా విస్తరించుకున్న ఆయన.. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడ్డారు. ఇలా ప్రపంచంలోనే అపర కుబేరుల జాబితాలోకి చేరుకున్న గౌతమ్ అదానీ.. ప్రస్తుతం మరోసారి తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
3 నుంచి ఏడో స్థానానికి పడిపోయి..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి హిండెన్బర్గ్ రూపంలో అతిపెద్ద సవాల్ ఎదురవుతోంది. షేర్ల విలువ పతనం కావడంతో వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఆయన కంపెనీలు చవిచూస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే సుమారు రూ.లక్షన్నర కోట్లకుపైగా అదానీ సంపద ఆవిరయ్యింది. దీంతో ప్రపంచంలోనే అపరకుబేరుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న ఆయన.. ప్రస్తుతం ఏడో స్థానానికి పడిపోయారు.
వజ్రాల షాపులో పనిచేసి..
అహ్మదాబాద్లో ఓ జైన్ కుటుంబంలో జన్మించిన అదానీ.. కాలేజీ చదువును మధ్యలోనే మానేశారు. టీనేజర్గా ఉన్న సమయంలో ముంబయికు చేరుకున్న ఆయన.. వజ్రాల వ్యాపారి దగ్గర కొంతకాలం పనిచేశారు. అనంతరం 1981లో గుజరాత్కు తిరిగి చేరుకున్న అదానీ.. పీవీసీ ఫిల్మ్ ఫ్యాక్టరీని నడిపించారు. 1988లో అదానీ ఎక్స్పోర్ట్స్ పేరుతో విదేశాలకు ఎగుమతులు మొదలుపెట్టిన ఆయన.. 1994లో లిస్టెడ్ కంపెనీగా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో అడుగుపెట్టి అదానీ ఎంటెర్ప్రైజెస్గా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
కిడ్నాపర్ల చెరలో బందీగా..
అదానీ వ్యాపారం విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో ఆయనకు అనూహ్య పరిణామం ఎదురయ్యింది. అదానీతోపాటు సహచరుడు శాంతీలాల్ పటేల్ కారులో వెళ్తున్న సమయంలో కొంతమంది దుండగులు వారిని అడ్డుకున్నారు. నుదుటన తుపాకీ పెట్టి వారిని అపహరించారు. ఫజ్లూ రెహ్మాన్, భోగీలాల్ డార్జీ (అలియాస్ మామా) అనే గ్యాంగ్స్టర్లు వారిని కిడ్నాప్ చేశారని.. సుమారు రూ.10కోట్లు డిమాండ్ చేసినట్లు చెబుతుంటారు. అయితే, వారికి ఆ నగదు చెల్లించారా లేదా అనే విషయం తెలియనప్పటికీ.. ఒకరోజు తర్వాత కిడ్నాపర్ల చెరనుంచి వారిద్దరూ విడులయ్యారు.
ముంబయి పేలుళ్ల ఘటనలో బయటపడి..
కిడ్నాపర్ల చెరనుంచి బయటపడిన అదానీకి మరోసారి మృత్యువు ఎదురొచ్చింది. 2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రదాడి సమయంలో తాజ్ హోటల్ల్లోనే ఉన్నారు. దుబాయ్ పోర్టు సీఈవో మొహమ్మద్ షరీఫ్తో భేటీ అయిన ఆయన.. బిల్లు చెల్లించి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతోన్న తరుణంలో ఉగ్రవాదులు తాజ్ హోటల్పై దాడులకు తెగబడి వందల మందిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 160మంది ప్రాణాలు కోల్పోగా.. మరెంతో మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ రాత్రి మొత్తం హోటల్ బేస్మెంట్లోనే గడిపిన ఆయన.. కమాండోలు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మరుసటి రోజు ఉదయం ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్న అదానీ.. ‘మృత్యువుని 15 అడుగుల దూరంలో చూశాను’ అని విలేకరులతో పేర్కొన్నారు.
వ్యాపారంలో..
నిత్యావసర వస్తువుల నుంచి 1988లో పోర్టు వ్యాపారంలోకి వచ్చిన అదానీ.. మళ్లీ తిరిగి వెనక్కి చూసుకోలేదు. అనతికాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ.. విద్యుత్, మైనింగ్, గ్యాస్, వంట నూనెల రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో అదానీ వ్యాపారం మరింత విస్తరణ జరిగిందనే విమర్శలు ఉన్నాయి. అనేక రంగాల్లో పెట్టుబడులతో ముందుకెళ్లిన అదానీ.. ఎయిర్పోర్టులు, సిమెంటుతోపాటు తాజాగా మీడియా రంగంలోకి ప్రవేశించారు. ఇలా ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచిన అదానీ.. ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో మూడోస్థానానికి చేరుకున్నారు.
వివాదాలు కొత్త కాదు..
అదానీ గ్రూపునకు వివాదాలు కొత్తేమీ కాదనే తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ల్యాండ్లో ఏర్పాటు చేసిన బొగ్గు గని ప్రాజెక్టుపై అక్కడి పర్యావరణవేత్తల నుంచి అప్పట్లో వ్యతిరేకత ఎదురైంది. కేరళలో 900 మిలియన్ డాలర్లతో అదానీ గ్రూపు నిర్మిస్తున్న నౌకాశ్రయంపైనా మత్స్యకారులు ఆందోళనలు చేశారు. నాలుగు నెలలపాటు కొనసాగిన వ్యవహారం ఇటీవలే సమసిపోయింది.
తాజాగా హిండెన్బర్గ్ నివేదిక రూపంలో మరో భారీ సవాలును అదానీ గ్రూపు ఎదుర్కొంటోంది. షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని.. ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ చేసిన ఆరోపణలు అదానీ గ్రూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అదానీ గ్రూపుతోపాటు స్టాక్ మార్కెట్లపైనా స్పష్టంగా కనిపించింది. ఇటువంటి సమయంలో తాజా సవాలును అదానీ అధిగమించి మదుపర్లలో ఎలా విశ్వాసం నింపుతారనే విషయంపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
Tech Mahindra: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా మార్చితో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. లాభంలో భారీ క్షీణతను నమోదు చేసుకుంది. -
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ