Rs.2,000 Notes: ప్రారంభమైన నోట్ల మార్పిడి.. ఈ విషయాలు తెలుసా?
Rs.2,000 Notes: రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నేటి నుంచి వాటి మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 30 వరకు మార్చుకునేందుకు గడువు ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం!
దిల్లీ: నేటి నుంచి రూ.2,000 నోట్ల (Rs.2,000 Notes) మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ఈ ప్రక్రియను 2016 నాటి నోట్ల రద్దుతో పోల్చుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అనవసరంగా కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
కంగారొద్దు..
నోట్ల రద్దు సమయంలో చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లతో పోలిస్తే.. ప్రస్తుతం రూ.2,000 నోట్ల (Rs.2,000 Notes) వాటా చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2,000 నోట్ల (Rs.2,000 Notes) వాటా కేవలం 10.8 శాతం మాత్రమేనని ఆర్బీఐ సైతం తెలిపింది. మరోవైపు నోట్ల రద్దు తర్వాత రూ.500, రూ.1,000 నోట్లు చెల్లుబాటు కాలేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం రూ.2,000 నోట్లు (Rs.2,000 Notes) చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఎలాంటి లావాదేవీకైనా దీన్ని ఉపయోగించుకోవచ్చని సూచించింది. మార్పిడి కోసం విధించిన సెప్టెంబరు 30 గడువు తర్వాత కూడా చెల్లుబాటు ఆగిపోతుందని ఇప్పటి వరకు ఆర్బీఐ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో నోట్ల మార్పిడికి ప్రజల దగ్గర తగినంత సమయం ఉంది.
మార్చుకోవాలా? డిపాజిట్ చేయాలా?
రూ.2000 నోట్ల (Rs.2,000 Notes) ఉపసంహరణ నేపథ్యంలో వాటిని మార్చుకోవాలా? లేదా ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవాలా? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. ఉన్న డబ్బుకు సరైన పత్రాలు, ఆధారాలు ఉంటే ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడమే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఒకసారి 10 నోట్లను మాత్రమే మార్చుకోవాలనే నిబంధన కేవలం నోట్ల మార్పిడికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. డిపాజిట్ విషయంలో ఈ నిబంధన అమలు కాదని పేర్కొన్నారు. కేవలం కొన్ని నోట్లు మాత్రమే ఉంటే మార్చుకోవడం మేలని చెబుతున్నారు. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే.. మార్చుకోవడం తప్ప మరో మార్గం లేదు.
పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తే..
రూ.2.5 లక్షల వరకు చేసే డిపాజిటర్లను ఎలాంటి ప్రశ్నలు అడగబోమని 2016లో నోట్ల రద్దు సమయంలో ప్రభుత్వం తెలిపింది. ఈ పరిమితి మించిన వారికి ఆదాయ పన్ను శాఖ (Income Tax Department) నోటీసులు పంపింది. కానీ, ఈసారి మాత్రం దీనిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అయితే, ఆదాయ పన్ను (Income Tax) శ్లాబుల ప్రకారం.. రూ.2.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేస్తే ఎటువంటి నోటీసులు అందే అవకాశం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అలాగే డిపాజిట్ చేసిన మొత్తానికి.. ఐటీ రిటర్నుల్లో చూపిన ఆదాయానికి పొంతన ఉండాలి. లేదంటే నోటీసులు అందే అవకాశం ఉంది. అలాగే పెద్ద మొత్తంలో రూ.2,000 నోట్లను డిపాజిట్ చేసేవారు ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది తప్పనిసరి కాకపోయినా.. అనుకోకుండా ఏదైనా ఇబ్బంది తలెత్తితే రక్షణగా ఉంటుందని చెబుతున్నారు.
ఎస్ఎఫ్టీ రూల్స్ తెలుసా?
ఖాతాదారులు కచ్చితంగా ‘స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్’ (SFT rules) నిబంధనలను తెలుసుకోవాలి. కొన్ని లావాదేవీల విలువ నిర్దేశిత పరిమితి మించితే వాటిని బ్యాంకులు ఆదాయ పన్ను విభాగానికి నివేదిస్తాయి. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డ్రాఫ్టులు, పే ఆర్డర్లు, చెక్కుల విలువ రూ.10 లక్షలు దాటితే వాటిని కూడా బ్యాంకులు ఐటీ అధికారులకు తెలియజేస్తాయి. పొదుపు ఖాతాల్లో డిపాజిట్ల విలువ రూ.10 లక్షలు దాటినా ఐటీకి తెలిసిపోతుంది. మరోవైపు ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు జమ, ఉపసంహరణ విలువ రూ.20 లక్షలు దాటితే పాన్ లేదా ఆధార్ సమర్పించాల్సి ఉంటుంది. అదే కరెంటు ఖాతా విషయంలోనైతే ఈ పరిమితి రూ.50 లక్షల వరకు ఉంది.
రూ.2 లక్షల పరిమితి..
నగల వ్యాపారులు లేదా బిల్డర్లు.. ఇలా ఎవరికైనా చెల్లించేటప్పుడు రూ.2 లక్షల పరిమితి ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఒక రోజులో ఒక వ్యక్తి లేదా సంస్థ రూ.2 లక్షల వరకు మాత్రమే నగదు రూపంలో స్వీకరించడానికి అనుమతి ఉంది. పెద్ద బిల్లులను రూ.2 లక్షల కింద విభజించి స్వీకరించడం కూడా నిబంధనలకు విరుద్ధం.
కేవైసీ పత్రాలు తీసుకెళితే మేలు..
నోట్ల మార్పిడికి పాన్, ఆధార్ వంటి పత్రాలను విధిగా సమర్పించాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే, సాధారణంగా డిపాజిట్ల మొత్తం రూ.50 వేలు దాటితే పాన్ జత చేయాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉంది. అదే ఇప్పుడు కూడా వర్తిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం స్పష్టం చేశారు. అయినప్పటికీ.. డిపాజిట్ చేసే మొత్తంతో సంబంధం లేకుండా నోట్ల మార్పిడి కోసం వెళ్లే అందరూ కేవైసీ పత్రాలను వెంట తీసుకెళ్లడం మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తీసుకెళ్లడం తప్పనిసరి కాకపోయినప్పటికీ.. వెంట ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.
ఒకరోజులో ఎంత మొత్తం..
ఒకరోజులో ఎంత మొత్తం మార్చుకోవచ్చనే దానిపై ఆర్బీఐ ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే, ఒక్క లావాదేవీలో 10 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు వీలుంది. అలా ఎన్నిసార్లైనా లైన్లో నిలబడి నోట్లను మార్చుకునే వెసులుబాటు ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే, నగదు లభ్యత, బ్యాంకుల్లో రద్దీ.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని బ్యాంకులు స్థానికంగా ఏమైనా పరిమితులు విధించే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?