FDs: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

ఆర్‌బీఐ రెపో రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచిన అనంతరం కోటక్‌ మహీంద్రా బ్యాంకు తన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది.

Published : 10 Feb 2023 15:34 IST

 దిల్లీ: ఆర్‌బీఐ రెపో రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచిన తర్వాత కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఎంపిక చేసిన కాలపరిమితి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. 180 నుంచి 363 రోజుల సాధారణ డిపాజిట్లపై 6%, 364 రోజుల డిపాజిట్‌పై 6.25%, 365 రోజుల నుంచి 389 రోజుల ఎఫ్‌డీపై 6.90%, 390 రోజుల నుంచి 2 సంవత్సరాల లోపు ఎఫ్‌డీలపై 7.10% వడ్డీ పొందొచ్చు. ఈ డిపాజిట్లన్నింటిలోనూ సీనియర్‌ సిటిజన్లు అదనంగా 0.50% వడ్డీ రేటును  పొందొచ్చు. అంటే సీనియర్‌ సిటిజన్లు ఈ బ్యాంకులో గరిష్ఠంగా 7.60% వడ్డీ రేటు వరకు పొందుతారు. ఈ కొత్త రేట్లు 2023 ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వస్తాయి. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఈ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు వర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని