Interest Rates: ఎఫ్‌డీలపై వడ్డీ రేటు పెంచిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌

కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఎఫ్‌డీలపై(ఒక కాలవ్యవధికి)  వడ్డీ రేటును 50 బీపీఎస్‌ పాయింట్లు పెంచింది.

Published : 11 May 2023 17:12 IST

దిల్లీ: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 50 బేసిస్‌ పాయింట్లు (బీపీఎస్‌) వరకు పెంచింది. ఈ బ్యాంకులో సాధారణ పౌరులు 2.75% నుంచి 7.20%, సీనియర్‌ సిటిజన్లు 3.25% నుంచి 7.70% వరకు కనీస, గరిష్ఠ వడ్డీ రేట్లను పొందొచ్చు. బ్యాంకు సాధారణ డిపాజిటర్లకు 180 రోజుల కాలవ్యవధిపై 50 బీపీఎస్‌ పెంపుతో వడ్డీ రేటును 6.50% నుంచి 7% వరకు పెంచింది. 

365 రోజుల నుంచి 389 రోజుల డిపాజిట్లపై 7.10% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. ఇదే డిపాజిట్‌పై సీనియర్‌ సిటిజన్లు 7.60% వడ్డీని పొందొచ్చు. బ్యాంకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి వరకు డిపాజిట్లను అందిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు 2023, మే 11 నుంచి అమల్లోకి వస్తాయి. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఈ బ్యాంకు రికరింగ్‌ డిపాజిట్ల (ఆర్‌డీ)పై సాధారణ పౌరులకు 6 నెలల నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధికి 6-7.20%, సీనియర్‌ సిటిజన్లకు 6.50-7.70% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని