Uber Files: ఉబర్ ఐరోపా ప్రయాణంలోని చీకటి రహస్యాలు!
ఉబర్ తమ కార్యకలాపాల విస్తరణ సమయంలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డట్లు తాజాగా బయటకొచ్చిన కొన్ని కీలక పత్రాల ద్వారా తెలుస్తోంది....
ఇంటర్నెట్ డెస్క్: ఉబర్ (Uber).. బహుశా ఈ పేరు వినని నగరవాసులు ఉండరంటే అతిశయోక్తి కాదు. రైడ్ షేరింగ్ (Ride Sharing) మార్కెట్కు పెరుగుతున్న డిమాండ్ను అందిపుచ్చుకొని అనతికాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. అయితే, కార్యకలాపాల విస్తరణ సమయంలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డట్లు తాజాగా బయటకొచ్చిన కొన్ని కీలక పత్రాల ద్వారా తెలుస్తోంది. వ్యాపార విస్తరణ కాంక్షతో దేశాధినేతలను సైతం తమ ఆఫర్లతో ప్రభావితం చేయడం ఇప్పుడు బిజినెస్ ప్రపంచాన్ని విస్తుగొలుపుతోంది.
అవకతవకలకు పాల్పడ్డట్లు ఉబర్ (Uber) సైతం అంగీకరించింది. అయితే, అప్పటి తమ నిర్ణయాలు ప్రస్తుత విలువలతో ఏమాత్రం సరిపోలవని ప్రకటించింది. అప్పటితో పోలిస్తే కంపెనీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. 2013-17 మధ్య ఈ-మెయిళ్లు, ఇతర పత్రాలు సహా మొత్తం లక్షకు పైగా రికార్డులను పరిశీలించడం ద్వారా అవకతవకలకు పాల్పడిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్’ సహా ప్రపంచవ్యాప్తంగా పలు మీడియా సంస్థలకు ఈ వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఐరోపా ట్యాక్సీ మార్కెట్కు హస్తగతం చేసుకునేందుకు ఏటా 90 మిలియన్ డాలర్ల వరకు లాబీయింగ్ కోసం ఖర్చు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో అనేక మంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులను సైతం ఉపయోగించుకొన్నట్లు స్పష్టమవుతోంది.
మేక్రాన్ తలపెట్టిన మేలు..
2014లో ఆర్థికమంత్రిగా ఉన్న ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు), ఐరోపా సమాఖ్య మాజీ డిజిటల్ కమిషనర్ నీలీ క్రోస్.. వంటి పెద్దతలకాయలు ఉబర్కు అనుకూల నిర్ణయాలు తీసుకున్నట్లు లీకైన పత్రాల ద్వారా తెలుస్తోంది. దీనంతటికీ అప్పటి ఉబర్ బాస్ ట్రావిస్ కలనిక్ నిర్ణయాలే కారణమని సమాచారం. 2017లో ఆయనకు ఉద్వాసన పలికారు. తర్వాత వచ్చిన దారా ఖోస్రోషాహికి సంస్థ ప్రక్షాళన బాధ్యతలు అప్పగించినట్లు తాజాగా ఉబర్ పేర్కొంది. ఓ చట్టబద్ధమైన పబ్లిక్ కంపెనీ వలే నడిపేందుకు ఆయన అనేక మార్పులు చేసినట్లు వెల్లడించింది.
ఐరోపాలో తొలిసారి 2014లో ప్యారిస్ నగరం నుంచి ఉబర్ కార్యకలాపాల్ని ప్రారంభించింది. దీన్ని ఒక గొప్ప ఉద్యోగ కల్పన అవకాశంగా భావించిన మేక్రాన్ కంపెనీ ఎదుగుదలకు తన పరిధిని దాటి నిర్ణయాలు తీసుకున్నారు. చివరికి లైసెన్స్ లేని డ్రైవర్లు కూడా తక్కువ ధరతో రైడ్ సేవల్ని అందించే ‘ఉబర్ప్రాప్’ కార్యకలాపాలకు అనుమతించారు. కోర్టు, పార్లమెంటు దాన్ని రద్దు చేసింది. అయినా, ఆ నిర్ణయంపై అప్పీల్కు వెళ్లి ఉబర్ప్రాప్ సేవల్ని కొనసాగించారు. దీనికి మేక్రాన్ మద్దతు ఉన్నట్లు తాజా పత్రాల ద్వారా వెల్లడవుతోంది. ఉబర్ప్రాప్పై ఫ్రాన్స్ ట్యాక్సీ ఇండస్ట్రీ పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. చివరకు అవి హింసాత్మకంగా మారడంతో ఉబరే వెనక్కి తగ్గింది. ఉబర్ప్రాప్ అనుమతికి ముందు మేక్రాన్, ట్రావిస్ కలనిక్ పలుసార్లు కలవడం అప్పల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే, మేక్రాన్ తన విధుల్లో భాగంగానే ఉబర్ బాస్ను కలిశారని తర్వాత ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఉబర్, నెదర్లాండ్స్కు వారధిగా...
తమ అధికార పరిధిని దాటి ఉబర్కు సహరికరించిన పెద్ద తలకాయల్లో ఐరోపా సమాఖ్య డిజిటల్ కమిషనర్ నీలీ క్రోస్ ఒకరు. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి బడా సంస్థలకు భారీ జరిమానాలు విధించిన బ్యూరోక్రాట్గా ఆమెకు పేరుంది. తన సొంతదేశమైన నెదర్లాండ్స్లో ఉబర్ప్రాప్ కార్యకలాపాల కొనసాగింపునకు ఆమె పరోక్షంగా సహకరించారు. అప్పటి ఆ దేశ ప్రభుత్వ పెద్దలను ఒప్పంచి నియమ, నిబంధనలను అందుకనుగుణంగా మార్పించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ, నెదర్లాండ్స్ కోర్టులు సైతం ఉబర్ప్రాప్ను రద్దు చేయాలని ఆదేశించాయి. పైగా ఉబర్తో తనకున్న అనధికార సంబంధాల్ని బయటకు వెల్లడించొద్దని క్రోస్ తమ సిబ్బందిని కోరుతూ రాసిన ఈ-మెయిల్ ఒకటి వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, ఉబర్కు మధ్య క్రోస్ వారధిగా పనిచేశారు. అందుకు ప్రతిఫలంగా ఆమె తన పదవీకాలం ముగిసిన తర్వాత ఉబర్లో సలహాదారుగా చేరేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు. కానీ, ఇది ఈయూ నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ.. అనధికారికంగా ఆమె ఆ బాధ్యతల్లో కొనసాగారు.
కిల్ స్విచ్..
ఒకవేళ పోలీసులు లేదా ఇతర దర్యాప్తు సంస్థలు ఉబర్పై విచారణ చేపడితే వీలైనంత తర్వాత ‘కిల్ స్విచ్’ వ్యవస్థను యాక్టివేట్ చేయాలని తమ సిబ్బందిని ట్రావిస్ స్వయంగా ఆదేశించినట్లు ఈ-మెయిళ్ల ద్వారా తెలిపింది. ఫలితంగా కంపెనీ కేంద్ర కార్యాలయంలో ఉండే కీలక సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు దర్యాప్తు సంస్థలకు సాధ్యంకాదు. ఆమ్స్టర్డామ్లో ఉన్న తమ ఉబర్ సర్వర్ల నుంచి డ్రైవర్ల జాబితా వంటి కీలక సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు యాక్సెస్ చేసుకోలేవు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు విచారణలో సహకరించాలి. కానీ, ఉబర్ దీన్ని తమ వృద్ధికి అవరోధంగా భావించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?