LIC:ఎల్ఐసీ షేర్ ధరల శ్రేణి ఇదే! వారికి ప్రత్యేక రాయితీ..!
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ మే 4-9 తేదీల మధ్య జరగొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే
దిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ మే 4-9 తేదీల మధ్య జరగొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎల్ఐసీ షేర్ ధరను కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. బుక్ బిల్లింగ్ పద్ధతిలో షేరు ధరల శ్రేణి రూ.902 నుంచి రూ.949 మధ్య ఉంటుందని చెప్పాయి. ఐపీవోలో పాల్గొనే ఎల్ఐసీ పాలసీదారులకు షేర్కు రూ.60, రిటైల్ ఇన్వెస్టర్స్, సంస్థ ఉద్యోగులకు షేర్కు రూ.40 రాయితీ ఇవ్వనుందట. మే 4న ప్రారంభమయ్యే సబ్స్క్రిప్షన్ మే 9న ముగియనుంది.
సంస్థలో 3.5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్ఐసీ విలువ(ఎంబెడెడ్ వాల్యూ - భవిష్యత్తు లాభాల ప్రస్తుత విలువ, సర్దుబాటు చేసిన నికర ఆస్తి విలువ కలిసి)ను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. గత ఫిబ్రవరిలో వేసిన ప్రణాళిక మేరకు ఎల్ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓలో విక్రయించాల్సి ఉంది. అయితే, ఉక్రెయిన్-రష్యా యుద్ధంగా కారణంగా మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులకు లోనైన నేపథ్యంలో ఐపీవోను ఇప్పటివరకూ వాయిదా వేసుకుంటూ వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి