Electric Vehicles: ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ బైక్ ఎప్పుడు రానుందంటే?
ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ రూ.500 కోట్లు సమీకరించేందుకు యోచిస్తోందని కంపెనీ ఎండీ, సీఈఓ యోగేశ్ భాటియా తెలిపారు....
దిల్లీ: ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ రూ.500 కోట్లు సమీకరించేందుకు యోచిస్తోందని కంపెనీ ఎండీ, సీఈఓ యోగేశ్ భాటియా తెలిపారు. సొంత తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వ్యాపార విస్తరణకు వీటిని ఉపయోగిస్తామని వెల్లడించారు. 2023 ద్వితీయార్ధంలో కంపెనీ నుంచి తొలి వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.
అమెరికాకు చెందిన హార్లీ డేవిడ్సన్కు చెందిన హరియాణాలోని బవల్ తయారీ కేంద్రాన్ని సొంతం చేసుకున్న సయేరా ఎలక్ట్రిక్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్తో ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకొంది. అక్కడి నుంచే తొలిదశలో తమ వాహనాలను తయారు చేయనుంది. వివిధ కేటగిరీల్లో మొత్తం మూడు వాహనాలను విడుదల చేస్తామని భాటియా తెలిపారు. వీటిలో ఎలక్ట్రిక్ బైక్ 2023 ద్వితీయార్ధంలో మార్కెట్లోకి వస్తుందన్నారు. కంపెనీ నుంచి రాబోయే రెండో బైక్.. విద్యుత్తు స్కూటర్, మోటార్సైకిల్ సమ్మేళనమైన హైపర్ బైక్ అని పేర్కొన్నారు. మూడోది ఎలక్ట్రిక్ స్కూటర్ అని వెల్లడించారు.
గత ఏడాది ఆగస్టులో ఎల్ఎంఎల్ బ్రాండ్ను, దాని మేధోపరమైన హక్కులను ఎస్జీ కార్పొరేట్ మొబిలిటీ సొంతం చేసుకుంది. బ్రాండ్ కొనుగోలు, వాహన అభివృద్ధి, తొలిదశ తయారీ.. వంటి ప్రాథమిక దశ కార్యకలాపాలకు రూ.350 కోట్లు కేటాయించినట్లు భాటియా తెలిపారు. భారత్ సహా విదేశాల్లో కంపెనీ వ్యాపార విస్తరణకు రూ.400-500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. సొంతంగా వాహన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కూడా అందులో భాగమన్నారు.
తొలిదశ తయారీ కోసం ప్రస్తుతానికి సయేరాతో భాగస్వామ్యం కుదుర్చుకొన్నప్పటికీ.. సమాంతరంగా సొంత తయారీ కేంద్రం ఏర్పాట్లను కూడా ముమ్మరం చేస్తున్నామన్నారు. దాదాపు రెండేళ్లలో సొంత కేంద్రంలో తయారీ ప్రారంభిస్తామని తెలిపారు. 2025 నాటికి ఏటా 10 లక్షల వాహనాల ఉత్పత్తే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. వచ్చే 4-5 ఏళ్లలో ప్రతి జిల్లాలో తమ విక్రయ కేంద్రాలు ఉండేలా చూస్తామన్నారు.
1990ల్లో మంచి జనాదరణ ఉన్న ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఎల్ఎంఎల్ ఒకటి. కాన్పూర్ కేంద్రంగా పనిచేసిన ఈ కంపెనీ క్రమంగా ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకొని చివరకు దివాలా తీసింది. 2018లో కంపెనీ లిక్విడేషన్కు ఎన్సీఎల్టీ అలహాబాద్ ధర్మాసనం ఆదేశించింది. విద్యుత్తు వినియోగ వస్తువులు, డెటెల్ బ్రాండ్తో విద్యుత్తు ద్విచక్ర వాహన తయారీలో ఉన్న భాటియా నేతృత్వంలోని ఎస్జీ కార్పొరేట్ మొబిలిటీ గత ఏడాది ఆగస్టులో సింఘానియా కుటుంబం నుంచి ఎల్ఎంఎల్ బ్రాండ్, దాని మేధోపరమైన హక్కుల్ని సొంతం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది. -
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్
మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) క్రెటా ఎన్లైన్ను హ్యుందాయ్ సోమవారం ఆవిష్కరించింది. ప్రారంభ ధర రూ.16.82 లక్షలు(ఎక్స్షోరూం). ఎన్8, ఎన్10 వేరియంట్లలో ఇది లభించనుంది. రూ.25,000తో బుకింగ్లను ప్రారంభించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్