China Lockdown: చైనాలో ఐఫోన్ తయారీ కేంద్రం చుట్టూ ఆంక్షలు
China Lockdown: చైనా అనుసరిస్తున్న జీరో కొవిడ్ విధానం ఐఫోన్ సరఫరాలో ఇబ్బందుల్ని సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ తయారీ కేంద్రం ఉన్న ఫాక్స్కాన్ యూనిట్ చుట్టూ లాక్డౌన్ విధించింది.
బీజింగ్: కరోనా మహమ్మారి కట్టడి కోసం చైనా అవలంబిస్తున్న ‘జీరో కొవిడ్’ విధానం వల్ల ఇప్పటికీ అక్కడ కఠిన లాక్డౌన్లను విధిస్తున్నారు. తాజాగా జెంగ్ఝౌ ప్రాంతంలో ఉన్న ఫాక్స్కాన్కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ తయారీ కేంద్రం చుట్టూ కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఇవి అమలులో ఉండనున్నాయి. నిత్యావసరాలు తప్ప మరే వాహనాలూ ఆ ప్రాంతంలో తిరగొద్దని స్థానిక పాలక వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి. జెంగ్ఝౌ ప్రాంతంలో కేసులు ఒక్కరోజులో 95 నుంచి 359కి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి.
తాజా నిర్ణయం వల్ల ఐఫోన్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తయారీ కేంద్రంలో ఇప్పటికే అసెంబ్లింగ్ చేసే సిబ్బంది దాదాపు లక్ష మంది బయటకు వెళ్లిపోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ విజృంభించడంతో, మళ్లీ ఎక్కడ ఇబ్బంది పడతామేమో అన్న భయంతోనే వారంతా వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. ఇతర దేశాలన్నీ కరోనా ఆంక్షలను సడలిస్తుండగా.. చైనా మాత్రం కొవిడ్ కేసులే లేకుండా చూసేందుకు నగరాలను వారం లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు మూసేస్తోంది. ఫాక్స్కాన్ సైతం పనులు కొనసాగేందుకు తన ప్లాంటులో ‘క్లోజ్డ్ లూప్ మేనేజ్మెంట్’ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఉద్యోగులంతా ప్లాంటులోనే ఉంటారు. బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. మూడు పూటలా ఆహారాన్నీ కంపెనీయే అందిస్తుంది. ఈ నిర్ణయంతో దాదాపు రెండు లక్షల మంది క్వారంటైన్లో ఉన్నట్లైంది.
సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు ఫాక్స్కాన్ తెలిపింది. వేతనాలు పెంచడం, చైనాలోని ఇతర తయారీ కేంద్రాల నుంచి సిబ్బందిని తరలించడం వంటి చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొంది. ఇప్పటికే కొంతమంది సిబ్బంది కరోనా సోకి మరణించినట్లు వస్తున్న వార్తల్ని కంపెనీ తోసిపుచ్చింది. యాపిల్ ఇటీవలే ఐఫోన్ 14 సిరీస్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వీటికి అధిక గిరాకీ కొనసాగుతున్న ఈ సమయంలో సరఫరాలో ఇబ్బందులు తలెత్తడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 14 సరఫరాలో 80 శాతం జెంగ్ఝౌ ఫాక్స్కాన్ ప్లాంట్ నుంచే వస్తున్నాయి. 85 శాతం ఐఫోన్ 14 ప్రోలు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. అయితే భారత్లోని చెన్నై ప్లాంటులో కూడా ఫాక్స్కాన్ సంస్థ ఐఫోన్ 14 అసెంబ్లింగ్ను మొదలుపెట్టడం గమనార్హం.
ఎంత మంది ఉద్యోగులకు వైరస్ సోకింది? కొత్త కేసులు ఇంకా వస్తున్నాయా? అక్టోబరులో చికిత్స అందని రోగుల నుంచి ఫిర్యాదులు అందాయా.. వంటి అంశాలను ఫాక్స్కాన్ ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇక్కడి 2 లక్షల మంది కార్మికుల్లో దాదాపు సగం మంది వెళ్లిపోయారని వార్తలొస్తుండగా, ఉత్పత్తిపై ఎంత మేర ప్రభావం పడిందన్నదానిపై యాపిల్ నుంచి స్పష్టతా రాలేదు. అయితే ఉత్పత్తిపై 30 శాతం వరకు ప్రభావం పడుతుందనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
IndiGo: విమాన ప్రయాణంలో వినోదాన్ని అందించే సేవల్ని మే1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండిగో ఓ ప్రకటనలో పేర్కొంది. -
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
Gold price: బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడంతో అంతర్జాతీయంగా వీటి ధరలు దిగివచ్చాయి. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో భారీ పెట్టుబడులు
రాబోయే 3-4 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ.. వాటి విడిభాగాల ఉత్పత్తి నిమిత్తం రూ.25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది. -
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
OTP frauds: ఓటీపీ స్కామ్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులోభాగంగానే టెలికాం, ఎస్బీఐ కార్డ్స్తో కలిసి పనిచేస్తోంది. -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
విమానాల్లో తల్లిదండ్రులకు పక్కనే చిన్నారులకు సీటు కేటాయించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. -
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM