Neeraj Chopra: గోల్డెన్ బాయ్ కోసం ‘జావెలిన్ గోల్డ్ ’ ఎడిషన్ ఎక్స్యూవీ700
ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత స్వర్ణ కలలను టోక్యోలో నీరజ్ చోప్రా సాకారం చేయడంతో దేశం మొత్తం మురిసిపోయింది. ఆయనకు అభినందనలు..
ఇంటర్నెట్డెస్క్: ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత స్వర్ణ కలలను టోక్యోలో నీరజ్ చోప్రా సాకారం చేయడంతో దేశం మొత్తం మురిసిపోయింది. ఆయనకు అభినందనలు, అవార్డులు వెల్లువెత్తాయి. నీరజ్ విజయాన్ని చూసి గర్వపడిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. తన ఫ్లాగ్ షిప్ ఎస్యూవీ ‘ఎక్స్యూవీ700’లో ఏకంగా ‘జావెలిన్ ఎడిషన్’ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఎడిషన్ తొలికారు నీరజ్కు బహూకరిస్తామని ఆనంద్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘ఎక్స్యూవీ 700 జావెలిన్ గోల్డ్ ఎడిషన్’ను నీరజ్కు అందజేశారు. దీనిపై నీరజ్ చోప్రా ట్విటర్లో ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రత్యేకమైన మార్పులతో వాహనం బహుమతిగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఆనంద్ జీ. దీనిపై త్వరలోనే డ్రైవ్కు వెళతాను’ అని ట్వీట్ చేశారు.
దీనిని ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేస్తూ..‘‘మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. మా ఎక్స్యూవీ, ఛాంపియన్స్ రథం మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది’’ అని పేర్కొన్నారు. పారాలింపిక్స్ జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన సుమిత్కు కూడా ఇలాంటి కారునే ఆనంద్ బహూకరించారు. పారాలింపిక్స్లో స్వర్ణ పతకాలు తెచ్చిన అవని సహా మిగిలిన వారికి ఈ ఎడిషన్ వాహనాలను అందజేయనున్నారు.
నీరజ్ విజయానికి గుర్తుగా వాహనంలో మార్పులు..
నీరజ్కు బహూకరించిన కారును పూర్తిగా మిడ్నైట్ బ్లాక్ రంగులో తీర్చిదిద్దారు. ఈ కారు బయట క్రోమ్ కోటింగ్ ఉన్న వాటిని బంగారపు భాగాలతో రీప్లేస్ చేశారు. మహీంద్రా లోగో కూడా ఇలానే మార్చారు. టోక్యోలో నీరజ్ బల్లెం విసిరిన 87.58 మీటర్ల రికార్డును స్టిక్కర్ రూపంలో కారు వెనుక టెయిల్ గేట్పై అమర్చారు. దీంతోపాటు ముందువైపు ఫెండర్ వద్ద కూడా ఇలాంటిదే ఉంచారు. రిజిస్ట్రేషన్ సమయంలో కూడా నీరజ్ ఈ నాలుగు నంబర్లనే ఎన్నుకున్నారు. ఇక కారు లోపల సీట్లను బంగారు దారంతో కుట్టారు. ఈ స్పెషల్ ఎడిషన్ మార్పుల మొత్తాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ డిజైనింగ్ ఆఫీసర్ ప్రతాప్ బోడే దగ్గరుండి చూసుకొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు