Income tax: కొత్త పన్ను విధానం.. రూ.7లక్షల వరకూ రాయితీ.. శ్లాబుల కుదింపు
ఆదాయపన్ను విషయంలో ఈ సారి కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు యత్నించింది.
ఇంటర్నెట్డెస్క్: వ్యక్తిగత ఆదాయపు పన్ను (Income tax) విధానానికి సంబంధించి ఈ సారి బడ్జెట్ (union budget 2023)లో కీలక మార్పులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక నుంచి రిటర్న్లు దాఖలు చేసే సమయంలో ‘కొత్త ఆదాయ పన్ను విధానం’ డీఫాల్ట్ ఆప్షన్గా వస్తుంది. పాత పన్ను విధానంలో ఉన్న వారు ఎప్పటిలా అందులో పొందుతున్న రాయితీలను మునుపటిలా కొనసాగించవచ్చు. వారు కోరుకుంటే కొత్త పన్ను పరిధిలోకి రావచ్చు. కొత్త పన్ను విధానానికి సంబంధించి బడ్జెట్లో చేసిన మార్పులు ఈ విధంగా ఉన్నాయి...
కొత్త పన్ను విధానంలో గతంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ ఇచ్చేవారు. కానీ, ఈ సారి ఆ రిబేట్ పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రూ.7లక్షలకు పెంచారు. రూ.7లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పు చేయలేదు.
కొత్త ఆదాయ పన్ను విధానంలోని శ్లాబుల సంఖ్యను కూడా తగ్గించారు. గతంలో 6 శ్లాబులు ఉండగా.. వాటిని తాజాగా 5కు కుదించారు.
- రూ.3 లక్షల వరకు ఎటువంటి పన్ను విధించరు.
- రూ.3-6 లక్షల వరకు 5శాతం పన్ను విధిస్తారు.
- రూ.6-9 లక్షల వరకు 10శాతం పన్ను చెల్లించాలి.
- రూ.9-12 లక్షలకు 15శాతం, రూ.12-15 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20శాతం పన్ను కట్టాలి.
- కొత్త విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటిన వారిపై అత్యధికంగా 30శాతం పన్ను రేటు విధిస్తారు.
ఉదాహరణకు ‘ఎ’ అనే వ్యక్తి ఏడాదికి రూ.7 లక్షల ఆదాయం పొందితే.. తొలి 3 లక్షలకు ఎలాంటి పన్ను ఉండదు. తర్వాత 4 లక్షలకు పై శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ సారి ఆ మొత్తంపై రిబేట్ ఇచ్చారు. దీంతో రూ.7లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
వార్షికాదాయం రూ.15 లక్షలు ఉంటే రూ.1.5లక్షల వరకు పన్ను చెల్లించాల్సి రావచ్చు. గతంలో ఇది రూ. 1.87 లక్షల వరకు ఉంది. అత్యధిక ఆదాయపన్నుపై సర్ఛార్జి రేటును 37శాతం నుంచి 25శాతానికి తగ్గించారు.
* కొత్త పన్ను విధానంలో రూ.15.5 లక్షల ఆదాయం దాటితే స్టాండర్డ్ డిడక్షన్ రూ.52,500గా ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది. -
సీపీ గుర్నానీ కంపెనీతో ఇంటర్గ్లోబ్ భాగస్వామ్యం
టెక్ దిగ్గజం సీపీ గుర్నానీకి చెందిన అసాగోతో, ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యం కుదుర్చుకుని, కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార వెంచర్ ‘అలాన్ఓఎస్’ను ఏర్పాటు చేసింది. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ లాభం రూ.212 కోట్లు
కన్జూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (టీసీపీఎల్) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.212.26 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది -
ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి అడుగులేస్తాం!
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రాంగణ ఎంపికలపై ఆచితూచి వ్యవహరిస్తామని, పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మధ్య స్థాయి ఐటీ సేవల కంపెనీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు(8)
ఫోక్స్వ్యాగన్ తన స్పోర్ట్ వినియోగ వాహనం (ఎస్యూవీ) టైగన్లో రెండు కొత్త వేరియంట్లను విపణిలోకి విడుదల చేసింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది?