Zomato: ఒకే ఒక్కడు.. ఏడాదిలో జొమాటోలో 3వేలకు పైగా ఆర్డర్లు!
మీరు ఈ ఏడాదిలో ఎన్నిసార్లు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుంటారు?.. పది, ఇరవై లేదా ముప్పై. ఇంకాస్త ఎక్కువైతే ఓ ఎనభై లేదా వంద సార్లు. కానీ, దిల్లీకి చెందిన ఓ వ్యక్తి 2022లో రికార్డు స్థాయిలో ఫుడ్ ఆర్డర్ చేసినట్లు జొమాటో తన వార్షిక నివేదికలో పేర్కొంది.
దిల్లీ: వినియోగదారులకు అందించే సేవలకు సంబంధించి ప్రతి సంస్థ ఏడాది చివర్లో వార్షిక నివేదికను విడుదల చేస్తుంది. ఇదే క్రమంలో ఫుడ్ డెలివరీ యాప్ (Food Delivery App) జొమాటో (Zomato) సైతం ఈ ఏడాది వార్షిక నివేదికను వెల్లడించింది. ఇందులో యూజర్లు ఏ ఫుడ్ను ఎక్కువగా ఆర్డర్ చేశారు? టాప్ కస్టమర్ ఎవరు? ఏ నగరంవారు డిస్కౌంట్లను ఎక్కువగా ఉపయోగించారు వంటి వివరాలు ఉంటాయి.
జొమాటో తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2022లో ఎక్కువ మంది ఇష్టపడే ఫుడ్గా బిర్యానీ మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు, టాప్ కస్టమర్గా దిల్లీకి చెందిన అంకుర్ అనే వ్యక్తిని ప్రకటించింది. ఇతను ఈ ఏడాది జొమాటోలో 3,330సార్లు ఫుడ్ ఆర్డర్ చేశాడు. జొమాటో నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో ఇదే అత్యధికం. ఇతను రోజుకు తొమ్మిది చొప్పున ఏడాది మొత్తంలో మూడువేల ఫుడ్ ఆర్డర్లు చేశాడట. దీంతో ఇతన్ని ‘‘ది నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడీ’’గా జొమాటో తన నివేదికలో పేర్కొంది.
అంతేకాకుండా, జొమాటో ప్రొమో కోడ్లతో ఎక్కువ డిస్కౌంట్ పొందిన నగరవాసుల జాబితాను కూడా ప్రకటించింది. పశ్చిమబెంగాల్లోని రాయ్గంజ్ నగరంలోని యూజర్లు డిస్కౌంట్లను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తెలిపింది. ఈ నగరం నుంచి వచ్చే 99.7 శాతం ఆర్డర్లకు జొమాటో ప్రొమో కోడ్లను అప్లై చేసినట్లు నివేదికలో పేర్కొంది. ముంబయికి చెందిన వ్యక్తి జొమాటో డిస్కౌంట్లతో సుమారు ₹ 2.3 లక్షలు ఆదా చేసుకున్నట్లు ప్రకటించింది.
ఎక్కువ మంది ఇష్టపడే ఫుడ్గా బిర్యానీ తర్వాతి స్థానంలో పిజ్జా నిలిచింది. దేశవ్యాప్తంగా జొమాటో యూజర్లు ప్రతి నిమిషానికి 139 పిజ్జాలు ఆర్డర్ చేస్తున్నారట. మరో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy) వార్షిక నివేదిక ప్రకారం 2022లో నిమిషానికి 137 బిర్యానీలను డెలివరీ చేసినట్లు వెల్లడించింది. ఇక, ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఫుడ్ జాబితాలో బిర్యానీ తర్వాత మసాలా దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్ ఉన్నట్లు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
Swiggy: క్విక్- కామర్స్ విభాగమైన ఇన్స్టామార్ట్ను స్విగ్గీ మాల్తో అనుసంధానం చేసినట్లు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ గురువారం తెలిపింది. -
బేబీ ఫుడ్లో చక్కెర.. వివరణ ఇచ్చిన నెస్లే ఇండియా
బేబీ ఫుడ్స్లో చక్కెర అధిక స్థాయిలో వినియోగిస్తున్నారంటూ వచ్చిన వార్తలపై నెస్లే ఇండియా వివరణ ఇచ్చింది. -
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి. -
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
Cab Services: అదనంగా డబ్బులు వసూలు చేసినందుకుగాను ఉబర్ ఇండియాకు కన్జ్యూమర్ కమిషన్ రూ.28 వేలు జరిమానా విధించింది. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
Air India Express: తొలిసారి ఓటు వేయబోయే వారిని దృష్టిలో ఉంచుకొని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. అదేంటో చూద్దాం.. -
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
Best Airports: స్కైట్రాక్స్ ఏటా ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంటుంది. వీటిలో తొలి 20 స్థానాల్లో ఏవి నిలిచాయి? భారత్లోని ఎయిర్పోర్టుల పరిస్థితి ఏంటో చూద్దాం.. -
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్