Tech Jobs: అత్యవసరంగా రమ్మని.. ఇంటికెళ్లిపొమ్మని!
అత్యవసరంగా ముఖాముఖి సమావేశం ఉందని చెబుతూ, తీరా వెళ్లిన తర్వాత కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంటల వ్యవధిలోనే ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంపించేస్తున్నారని అంటున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) 18,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇదొక్కటే కాదు, గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft) లాంటి పెద్దపెద్ద సంస్థలు సైతం ఉద్యోగాలకు కోత వేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు లే ఆఫ్ (Lay off)ల పేరుతో జీతానికి గండి కొడుతున్నాయి. దీనిపై ఉద్యోగులు (Employees) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉన్న కొలువు.. రేపు ఉంటుందో లేదోనని భయపడుతున్నారు. అటు సంస్థలు కూడా కేవలం గంటల వ్యవధిలోనే సంస్థ నుంచి పంపించేయడం గమనార్హం.
ఉద్యోగం తీసేయడానికి ఇదో ఎత్తుగడ
ఉద్యోగం కోల్పోయిన కొంత మంది మీడియా ఎదుట, సామాజిక మాధ్యమాల్లోనూ తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ‘‘అత్యవసరంగా ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, తర్వాతి రోజే కార్యాలయానికి రావాలని సీనియర్ మేనేజర్ నుంచి ఓ అధికారిక మెయిల్ పంపిస్తున్నారు. అయితే, ఏ అంశంపై చర్చించనున్నారన్న సంగతి మాత్రం చెప్పడం లేదు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నందున దూరంగా ఉన్నానని రిప్లై ఇస్తే.. విమానం టికెట్లు తీసుకోవాలని, వాటి ఛార్జీలను కూడా కంపెనీయే భరిస్తుందని చెబుతూ.. తప్పని సరిగా హాజరు కావాలని హుకుం జారీ చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత సీనియర్ మేనేజర్, హెచ్ మేనేజర్ ఇద్దరూ తొలుత లే ఆఫ్ల గురించి చెబుతున్నారు. సమ్మతమైతే సంతకం చేయాలని, లేదంటే వేరే ఉద్యోగం చూసుకోవాలని అంటున్నారు. ఆలోచించుకునేందుకు కూడా సమయం ఇవ్వడం లేదు. కొందరికి లే ఆఫ్ ప్రస్తావన తీసుకురాకుండానే సంస్థ నుంచి తొలగిస్తున్నట్లు చెబుతున్నారు.’’ అని ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి జాతీయ మీడియా ఎదుట తన బాధను వ్యక్తం చేశాడు. ఉద్యోగులు కాదు, కూడదు అంటే వాళ్లకి సమాచారం ఇచ్చిన 4 గంటల తర్వాత సంస్థ అధికారిక లాగిన్లను బ్లాక్ చేస్తున్నారని చెప్పాడు. అమెజాన్ సంస్థ అయితే ఉద్యోగులకు విమాన ఛార్జీలతో పాటు, వసతికి అయ్యే ఖర్చు కూడా ఇస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగ ఆఫర్లు రద్దు
అమెజాన్ సంస్థ తమ ఉద్యోగులను తొలగిస్తే 5 నెలల జీతాన్ని పరిహారంగా ఇస్తోంది. కానీ, ఎలాన్మస్క్ సారథ్యంలోని ట్విటర్ మాత్రం అది పాటించడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. లే ఆఫ్లు విధిస్తూ జీతాలకు కోతవిధిస్తున్న ట్విటర్.. ముందస్తు పరిహారంపై ఏమైనా ప్రకటన విడుదల చేస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. అయితే ట్విటర్ ఇండియా మాత్రం ఉద్యోగం కోల్పోయిన వారికి రెండు నెలల జీతాన్ని పరిహారంగా చెల్లించింది. కొలువు కోల్పోయిన చాలా మంది ట్విటర్, లింక్డ్ ఇన్ ద్వారా కొత్త ఉద్యోగాల కోసం గాలిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అమెజాన్ సంస్థ ఇటీవల రిక్రూట్ చేసుకున్న ఫుల్టైం ఉద్యోగ ఆఫర్లను కూడా ఉపసంహరించుకుంది. దీంతో ఎంపికైన వారికి కూడా ఉద్యోగం లేకుండా పోయింది. అమెజాన్ మాత్రమే కాదు.. మెటా సంస్థ కూడా ఉద్యోగ ఆఫర్లను రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. 2023లో నియామకాల ప్రక్రియ కూడా నెమ్మదిగా సాగుతుందని తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ కూడా గత వారం 22,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!