Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opens: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 144 పాయింట్ల లాభంతో 66,374 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 36 పాయింట్లు లాభపడి 19,778 దగ్గర కొనసాగుతోంది.
Stock Market Opens | ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలున్నప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 144 పాయింట్ల లాభంతో 66,374 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 36 పాయింట్లు లాభపడి 19,778 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.83 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్గ్రిడ్, విప్రో, హెచ్యూఎల్, హెచ్సీఎల్ టెక్, సన్ఫార్మా, ఏషియన్ పెయింట్స్, టైటన్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ బాండ్ ఇండెక్స్లో భారత్ లిస్ట్ కానుంది. 2024 జూన్ నుంచి ఇండెక్స్లో భారత్ కనిపించనుంది. దీని వల్ల భారత బాండ్లలోకి వచ్చే ఏడాది పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం ఈరోజు ఈక్విటీ మార్కెట్లపై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెరికా మార్కెట్లు (Stock Market) గురువారం నష్టాల్లో ముగిశాయి. ఐరోపా సూచీలు సైతం అదే బాటలో పయనించాయి. నేడు ఆసియా- పసిఫిక్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. నేడు ‘బ్యాంక్ ఆఫ్ జపాన్’ తమ వడ్డీరేట్ల పెంపుపై కీలక నిర్ణయం వెలువరించనుంది. మదుపర్లు దీనిపై దృష్టి సారించే అవకాశం ఉంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) గురువారం రూ.3,007 కోట్లు విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DII) రూ.1,158 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు
గమనించాల్సిన స్టాక్స్..
- గ్లెన్మార్క్ ఫార్మా: తమ అనుబంధ సంస్థ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్(జీఎల్ఎస్)ను రూ.5,651.5 కోట్లతో నిర్మా లిమిటెడ్కు విక్రయించనున్నట్లు గ్లెన్మార్క్ ఫార్మాసూటికల్స్ తెలిపింది. ఒక్కో షేరు రూ.615 ధరకు మొత్తం 9,18,95,379 షేర్లు లేదా 75 శాతం వాటాను విక్రయించడానికి బోర్డు అనుమతి దక్కినట్లు ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో తెలిపింది.
- విప్రో: దేశీయ ఐటీ దిగ్గజం విప్రోలో దీర్ఘకాలంగా సీఎఫ్ఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్న జతిన్ ప్రవీణ్ చంద్ర దలాల్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అపర్ణ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
- టాటా మోటార్: సూపర్చార్జర్ల నెట్వర్క్ కోసం తమ అనుబంధ బ్రాండ్ జాగ్వార్.. టెస్లాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది.
- సంహీ హోటల్స్, జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సర్వీసెస్: ఈ ఇరు కంపెనీల షేర్లు ఈరోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి. సంహీ హోటల్స్ రూ.126, జాగిల్ రూ.164 ధర వద్ద ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే.
- రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL): ఝార్ఖండ్లో ఆరు వరుసల వారణాసి-రాంచీ-కోల్కతా రహదారిని నిర్మించేందుకు ఎన్హెచ్ఏఐతో ఆర్వీఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకొంది.
- ఐడియాఫోర్జ్: 400 నిఘా కాప్టర్లను సరఫరా చేసేందుకు M/s. Strategic Marketingతో ఐడియా ఫోర్జ్ ఒప్పందం కుదుర్చుకొంది. దీని విలువ రూ.58 కోట్లు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు
LPG Cylinder Price: అంతర్జాతీయ ధరల్లో మార్పులకు అనుగుణంగా వాణిజ్య వంట గ్యాస్, విమాన ఇంధన ధరలను సవరించినట్లు ఇంధన రిటైల్ కంపెనీలు వెల్లడించాయి. -
6 నెలలు దాటినా రూ.9700 కోట్లు విలువైన ₹2 వేల నోట్లు ప్రజల వద్దే
RBI on 2000 notes: రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుని ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ రూ.9700 కోట్ల విలువైన నోట్లు మాత్రం వెనక్కి రాలేదు. -
Flair Writing Listing: ఫ్లెయిర్ రైటింగ్ లిస్టింగ్ అదుర్స్.. ఒక్కో లాట్పై రూ.9,653 లాభం
Flair Writing Listing: ఫ్లెయిర్ రైటింగ్ ఐపీఓలో అలాట్ అయినవారు కనీసం 49 షేర్లపై రూ.14,896 పెట్టుబడిగా పెట్టారు. -
Home Loan: గృహ రుణం ముందే చెల్లించేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
Home Loan: ఒకవేళ మీకు ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు చేతికందినా లేదా ఆదాయం పెరిగినా, కొంత మొత్తాన్ని గృహ రుణ ముందస్తు చెల్లింపులకు ఉపయోగించడం వల్ల వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. -
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
Stock Market Opening bell ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 306 పాయింట్ల లాభంతో 67,295 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 95 పాయింట్లు పెరిగి 20,228 దగ్గర సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. -
జై.. జీడీపీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. తయారీ, గనులు, సేవల రంగం మెరుగ్గా రాణించడంతో ఇది సాధ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. -
అత్యంత విలువైన అంకురాలు @ బెంగళూరు
స్వయం కృషితో ఎదిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన అత్యంత విలువైన కంపెనీలకు అతిపెద్ద కేంద్రస్థానంగా భారత సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు నిలిచింది. -
పీవీఆర్ ఐనాక్స్ రూ.500 కోట్ల పెట్టుబడులు
దేశీయంగా అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్గా కొనసాగుతున్న పీవీఆర్ ఐనాక్స్, వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో మరో 150 కొత్త తెరలను ప్రారంభించాలనుకుంటోంది. -
అల్ట్రాటెక్ చేతికి కేశోరామ్ సిమెంట్
బి.కె.బిర్లా గ్రూపు ప్రధాన సంస్థ కేశోరామ్ ఇండస్ట్రీస్కు చెందిన సిమెంట్ వ్యాపారాన్ని ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయనుంది. షేర్ల బదిలీ (స్వాప్) రూపేణా ఈ కొనుగోలు లావాదేవీ జరగనుందని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ తెలిపింది. -
పిల్లలకు ఆర్థిక భద్రత..
యూనియన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా యూనియన్ చిల్డ్రన్ ఫండ్ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. కానీ, కనీసం అయిదేళ్లపాటు లేదా మైనర్ పిల్లలు మేజర్ అయ్యే వరకూ లాకిన్ నిబంధన వర్తిస్తుంది. -
ప్రయాణ బీమా..క్లెయిం చేసుకోవాలంటే...
-
Boat earbuds: 50 గంటల బ్యాటరీ లైఫ్తో బోట్ గేమింగ్ ఇయర్బడ్స్
Boat earbuds: సింగిల్ ఛార్జ్తో 50 గంటల ప్లేబ్యాక్ టైమ్తో బోట్ ఇయర్బడ్స్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2,299గా కంపెనీ నిర్ణయించింది. -
నెలకు రూ.8 వేలతో రూ.5 కోట్లు
నా వయసు 34. ప్రైవేటు ఉద్యోగిని. ఆరేళ్ల మా అమ్మాయి భవిష్యత్ కోసం నెలకు రూ.15 వేల వరకూ మదుపు చేద్దామని ఆలోచన. ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? -
పన్ను ప్రణాళిక ఆర్థిక లక్ష్యం నెరవేరేలా...
ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఇప్పటికే చాలామందికి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) ప్రారంభమయ్యింది. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు సరైన పెట్టుబడులను ఎంచుకోవాలి -
ఆదాయం.. బీమా రక్ష జీవితాంతం..
బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) పొదుపు, బీమాతోపాటు, హామీతో కూడిన ఆదాయాన్ని అందించేలా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. అదే జీవన్ ఉత్సవ్. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవితాంతం వరకూ బీమా రక్షణ అందించే పాలసీ. -
మదుపరి పంట పండింది
ఐపీఓ.. ఐపీఓ.. ఐపీఓ.. గత వారం రోజులుగా స్టాక్మార్కెట్ మదుపర్ల చర్చ అంతా వీటి మీదే. ఇందుకు తగ్గట్టుగానే టాటా టెక్నాలజీస్ సహా ఇతర కంపెనీల ఐపీఓలు లాభాల పంట పండించి,. నమ్మకాన్ని నిలబెట్టుకున్నాయి. భారీ నమోదు లాభాలను పంచి, మదుపర్లను మురిపించాయి. -
Gold Loan: అత్యవసరంలో పసిడి రుణం..
వ్యక్తిగత రుణాలకు నిబంధనలు కఠినతరం అవడంతో అప్పు దొరకడం కాస్త కష్టమవుతోంది.అత్యవసర సందర్భాల్లో ఉన్న సులువైన మార్గం బంగారంపై రుణం తీసుకోవడం. ఈ నేపథ్యంలో ఈ అప్పు తీసుకునేటప్పుడు ఏం చూడాలి? అనే అంశాలను తెలుసుకుందాం. -
గృహ విక్రయాలు 22% పెరిగాయ్!
దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో జులై-సెప్టెంబరు త్రైమాసికంలో గృహ విక్రయాలు 22 శాతం పెరిగాయని స్థిరాస్తి డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రోప్ టైగర్.కామ్ వెల్లడించింది. వినియోగదారు గిరాకీ బాగుందని తెలిపింది. -
ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ జాబితాలో నందన్ నీలేకని, నిఖిల్ కామత్
ఫోర్బ్స్ ఆసియా దాతృత్వ జాబితాలో ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని, డీఎల్ఎఫ్ గౌరవ ఛైర్మన్ కె.పి.సింగ్, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్కు చోటు లభించింది. -
అత్యంత విలాసవంత గృహాల విక్రయాలు 4 రెట్లు పెరిగాయ్
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు అల్ట్రా-లగ్జరీ (అత్యంత విలాసవంత) గృహాల విక్రయాలు 4 రెట్లు పెరిగి 58కి చేరాయని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. -
ముడి చమురు 80 డాలర్ల దిగువకు వస్తేనే రిటైల్ ధరల సవరణ!
అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్కు 80 డాలర్ల దిగువన స్థిరపడితేనే, ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను రోజువారీగా సవరిస్తాయని అధికారులు వెల్లడించారు.


తాజా వార్తలు (Latest News)
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు
-
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ
-
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
-
Rishab Shetty: నేను చెప్పింది ఇప్పటికి అర్థం చేసుకున్నారు.. తన స్పీచ్పై రిషబ్ శెట్టి పోస్ట్
-
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా