Stock Market: నష్టాల్లో మార్కెట్ సూచీలు.. 19,600 చేరువకు నిఫ్టీ
Stock Market Opens: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 202 పాయింట్ల నష్టంతో 65,742 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 57 పాయింట్లు నష్టపోయి 19,607 దగ్గర కొనసాగుతోంది.
Stock Market Opens | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 202 పాయింట్ల నష్టంతో 65,742 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 57 పాయింట్లు నష్టపోయి 19,607 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.23 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ఫార్మా, ఎల్అండ్టీ, రిలయన్స్, ఎంఅండ్ఎం షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, టైటన్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా మార్కెట్లు (Stock Market) మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు సైతం అదే బాటలో పయనించాయి. నేడు ఆసియా- పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. డీమ్యాట్ ఖాతాదారులు తమ ఖాతాలకు నామినీ వివరాలను అందించేందుకు గడువును 3 నెలలు పొడిగించి డిసెంబరు 31 వరకు అవకాశం ఇవ్వనున్నట్లు సెబీ తెలిపింది. డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు పెరిగాయని వరల్డ్లైన్ నివేదిక వెల్లడించింది. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం రూ.694 కోట్ల విలువ చేసే భారత ఈక్విటీలను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.715 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
గమనించాల్సిన స్టాక్స్..
- రేణుకా షుగర్స్: అనామిక షుగర్ మిల్స్లో 100 శాతం వాటాను రూ.235.50 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు శ్రీ రేణుకా షుగర్స్ తెలిపింది. ఈ లావాదేవీ అనంతరం అనామిక షుగర్ మిల్స్ తమకు పూర్తి అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది.
- సువెన్ ఫార్మాసూటికల్స్: విదేశీ పెట్టుబడి సంస్థ అయిన బెర్హయందా లిమిటెడ్, సైప్రస్.. సువెన్ ఫార్మాలో పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. సువెన్ ఫార్మాసూటికల్స్ ప్రమోటర్ల నుంచి 50.1 శాతం వాటా (12,75,37,043 ఈక్విటీ షేర్లు) కొనుగోలు చేయడానికి ఈ సంస్థ కొంతకాలం క్రితం ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే.
- ఐఆర్సీటీసీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) కొత్త ఆఫర్ను ప్రకటించింది. విమాన టికెట్ల బుకింగ్పై ప్రయాణికుల నుంచి ఎలాంటి కన్వీనియన్స్ రుసుము వసూలు చేయబోమని ప్రకటించింది. 24 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చినట్లు ఐఆర్సీటీసీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది.
- సుజ్లాన్: దిలీప్ సంఘ్వీ సహా మరికొంత మంది 2020 ఫిబ్రవరిలో సుజ్లాన్తో కుదుర్చుకొన్న ఓ కీలక ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు సమాచారం.
- ఇన్ఫోసిస్: ఇన్ఫోసిస్ టోపజ్, అజూర్ ఓపెన్ఏఐ సర్వీస్, అజూర్ కాగ్నిటివ్ సర్వీసెస్ కలిసి ఇండస్ట్రీ సొల్యూషన్స్ను అభివృద్ధి చేసేందుకు విప్రో, ఇన్ఫోసిస్ మధ్య ఒప్పందం కుదిరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 77 పాయింట్ల లాభంతో 66,979 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 26 పాయింట్లు పెరిగి 20,123 వద్ద కొనసాగుతోంది. -
మదుపర్ల సంపద @ 4 లక్షల కోట్ల డాలర్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరో రికార్డు నమోదైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది. -
ప్రపంచ అగ్రగామి 20 మంది కుబేరుల్లోకి అదానీ
గౌతమ్ అదానీ.. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్బర్గ్ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే.. -
స్థిరాస్తిలోకి వచ్చే ఏడాది భారీ పెట్టుబడులు
ఆసియా పసిఫిక్ ప్రాంతం (ఏపీఏసీ)లో భారత్, దక్షిణ కొరియాలలోని వివిధ స్థిరాస్తి ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. -
వచ్చే ఏడాది ప్రపంచం మందగమనమే
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆశ్చర్యకరరీతిలో బలంగానే కనిపించినా.. వచ్చే ఏడాది మాత్రం మందగమనం పాలు కావొచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేస్తోంది. -
డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు దాచుకోవడం కొనసాగుతోంది
కొవిడ్-19 పరిణామాల అనంతరం డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడం వల్ల, దేశంలో భౌతిక రూపంలో నగదు వినియోగానికి గిరాకీ నెమ్మదించింది. అయితే పొదుపు, అత్యవసరాల కోసం ముందుజాగ్రత్తగా దాచిపెట్టుకునే విషయంలో.... -
2030కి రూ.29 లక్షల కోట్లకు దేశీయ ఐటీ రంగం
దేశీయ ఐటీ రంగం 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని అక్సిలార్ వెంచర్స్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అంచనా వేశారు. -
రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు మెరుగ్గానే ఉండొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో మనదేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ బుధవారం తెలిపారు. -
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
అమెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్కు కుడిభుజంగా, ఆయన సంస్థ బెర్క్షైర్ హాతవేకు వైస్ఛైర్మన్గా వ్యవహరించిన చార్లీ మంగర్(99) కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్ రంగంలో ఒక శకం ముగిసింది. -
ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిద్ధం
ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ-శాటెల్లాజిక్ ఇంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలో స్పేస్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఏఎస్ఎల్ వెల్లడించింది. -
భారతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఐఏజీ కార్గో ఆసక్తి
భారత్లో వృద్ధి అవకాశాలపై సానుకూల ధోరణితో ఉన్న ఐరోపా దిగ్గజ సంస్థ ఐఏజీ కార్గో, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇక్కడి సంస్థల నుంచి సరైన -
రూ.45,000 కోట్ల ఖనిజాల వేలం
రూ.45,000 కోట్ల విలువైన 20 కీలక ఖనిజాల వేలాన్ని బొగ్గు, ఖనిజాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ప్రారంభించారు. ఇందులో రెండు లిథియం బ్లాక్(జమ్ము-కశ్మీర్, చత్తీస్గఢ్)లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. -
సంక్షిప్త వార్తలు
సంస్థలకు క్లౌడ్, ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే సీ1 (కన్వర్జ్వన్) హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్, కేపబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. -
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
LIC jeevan utsav full details: ఎల్ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్వాచ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి...


తాజా వార్తలు (Latest News)
-
Henry Kissinger: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ కన్నుమూత
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
-
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
-
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?