Maruti Suzuki: మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. నేటి నుంచే అమల్లోకి
Maruti Suzuki price hike: తయారీ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో తమ కార్ల ధరల్ని పెంచినట్లు మారుతీ సుజుకీ ఇండియా సోమవారం ప్రకటించింది.
దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) తమ కార్ల ధరల్ని పెంచినట్లు సోమవారం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ధరల్ని పెంచడం ఇది రెండోసారి. 2022 ఏప్రిల్లోనూ ధరల్ని పెంచింది. తాజా ధరల పెంపునకు సంబంధించి మారుతీ సుజుకీ (Maruti Suzuki) 2022 డిసెంబరులోనే ప్రకటన చేసింది. తయారీ వ్యయాలు పెరుగుతుండడంతో పాటు కొత్త ఉద్గార ప్రమాణాలను అమలు చేయడం కోసం పెంపు తప్పడం లేదని తెలిపింది.
మోడళ్లను బట్టి ధరల్ని 1.1 శాతం వరకు పెంచినట్లు మారుతీ సుజుకీ (Maruti Suzuki) వెల్లడించింది. నేటి నుంచే (జనవరి 16) పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఎంట్రీ లెవెల్ ఆల్టో నుంచి ఎస్యూవీ గ్రాండ్ విటారా వరకు పలు మోడల్ కార్లను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ. 3.39 లక్షల నుంచి రూ. 19.49 లక్షల (ఎక్స్షోరూం- దిల్లీ) మధ్య ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sanjay Raut: ‘దిల్లీకి వస్తే.. ఏకే-47తో కాల్చేస్తామన్నారు..’: సంజయ్ రౌత్
-
Sports News
MS DHONI: ధోనీ 15 ఏళ్ల కిందట ఉన్నంత దూకుడుగా ఉండలేడు కదా: సీఎస్కే కోచ్
-
General News
TSPSC paper leak: సిట్ విచారణకు హాజరైన టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్
-
Politics News
YS Sharmila : బండి సంజయ్, రేవంత్రెడ్డికి షర్మిల ఫోన్.. కలిసి పోరాడదామని పిలుపు
-
Movies News
Mahesh Babu: ‘దసరా’పై సూపర్స్టార్ అదిరిపోయే ప్రశంస
-
India News
Tamil Nadu: కళాక్షేత్రలో లైంగిక వేధింపులు.. దద్దరిల్లిన తమిళనాడు