Maruti Suzuki: 4 లక్షలకు పెరిగిన ‘మారుతీ సుజుకీ’ పెండింగ్ ఆర్డర్లు!
మారుతీ సుజుకీ సంస్థ వాహన పెండింగ్ ఆర్డర్ల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి 4 లక్షలు దాటింది. కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన జిమ్నీ, ఫ్రాంక్స్ మోడళ్లకు ఆదరణ ఎక్కువగా ఉందని సంస్థ తెలిపింది.
దిల్లీ: వాహన బుకింగ్లు పుంజుకోవడంతో ఈ ఏడాది జనవరినాటికి సంస్థ పెండింగ్ ఆర్డర్లు 4.05 లక్షలకు పెరిగాయని మారుతీ సుజుకీ (Maruti Suzuki) తెలిపింది. ఎస్యూవీ పోర్ట్ఫోలియోను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా తీసుకొచ్చిన జిమ్నీ, ఫ్రాంక్స్ మోడళ్ల ఆర్డర్ల సంఖ్యనూ ఇందులో పొందుపర్చినట్లు వెల్లడించింది. ఇప్పటికే జిమ్నీ(Jimny)లో 11 వేల యూనిట్లు, ఫ్రాంక్స్(Fronx)లో దాదాపు 4 వేలకుపైగా బుకింగ్లు అందినట్లు పేర్కొంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో గతేడాది డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం నాటికి 3.63 లక్షల వాహనాల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నట్లు మారుతీ సుజుకీ తెలిపింది. ఇందులో 1.19 లక్షల ఆర్డర్లు కొత్తగా విడుదల చేసిన మోడళ్లవేనని పేర్కొంది. ‘‘ప్రస్తుతం దాదాపు 4,05,000 బుకింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆర్డర్ల విషయంలో మంచి వృద్ధి కనిపిస్తోంది. కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన జిమ్నీ, ఫ్రాంక్స్ మోడళ్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. జిమ్నీలో రోజుకు 1,000 వాహనాలు, ఫ్రాంక్స్లో రోజుకు 300 యూనిట్లు బుక్ అవుతున్నాయి’’ అని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన జిమ్నీ, ఫ్రాంక్స్ వాహనాల ధరలను సంస్థ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. సెమీకండక్టర్ల కొరత వల్ల వాహనాల తయారీ తగ్గి, పెండింగ్ ఆర్డర్లు పెరుగుతున్నాయి. ‘మూడో త్రైమాసికంలో సెమీకండక్టర్ల కొరత కారణంగా దాదాపు 46 వేల వాహనాల ఉత్పత్తిపై ప్రభావం పడింది. 2021లో మారుతీ సుజుకీ మొత్తం 13.64 లక్షల వాహనాలు విక్రయించగా.. 2022నాటికి 16 శాతం పెరిగి 15.76 లక్షల యూనిట్లకు చేరుకుంద’ని సంస్థ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి