Maruti Suzuki: జనవరి నుంచి మారుతీ సుజుకీ వాహనాలు ప్రియం
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ జనవరి నుంచి అన్ని మోడళ్లపై ధరలను పెంచనుంది.
దిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) వాహన ధరలను పెంచనుంది. జనవరి నుంచి అన్ని మోడళ్లపై ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ద్రవ్యోల్బణం, నియంత్రణ ప్రమాణాలను అందుకోవడం వంటి కారణాల వల్ల ధరలు పెంచడం అనివార్యంగా మారిందని కంపెనీ తెలిపింది.
వాహన ధరలు పెంచకుండా ఉండేందుకు కంపెనీ చేయాల్సినదంతా చేసిందని, తప్పనిసరి పరిస్థితుల్లో పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మారుతీ సుజుకీ తెలిపింది. 2023 జనవరి నుంచి మోడళ్ల వారీగా పెంపు ఉండబోతోందని కంపెనీ తెలిపింది. అయితే, ఎంత మొత్తం పెంచేదీ మాత్రం కంపెనీ పేర్కొనలేదు. చివరి సారిగా ఈ ఏడాది ఏప్రిల్లో ఎక్స్షోరూమ్ ధరపై 1.3 శాతం మేర ధరలను మారుతీ సవరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Money Garland: వరుడు గుర్రమెక్కుతుండగా.. డబ్బుల దండతో పరార్!
-
General News
Telangana News: తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ
-
World News
Britain: లండన్ నగరంలో ఇంటి అద్దె.. నెలకు రూ.3 లక్షలట..!
-
Crime News
Crime News: పోలీసులుగా నటించి.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
-
Sports News
IND vs PAK: ఆసియా కప్ 2023.. గందరగోళానికి తెరపడాలంటే అదే సరైన విధానం: అక్రమ్
-
World News
USA: కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు.. ముగ్గురి మృతి!