Dzire Tour S: లేటెస్ట్‌ డిజైర్‌ టూర్‌ ఎస్‌ కార్ల రీకాల్‌..!

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన 166 డిజైర్‌ టూర్‌ ఎస్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది....

Published : 24 Aug 2022 16:03 IST

దిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన 166 డిజైర్‌ టూర్‌ ఎస్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్‌బ్యాగ్‌ కంట్రోల్‌ యూనిట్‌లో లోపాన్ని గుర్తించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. 2022 ఆగస్టు 6 నుంచి ఆగస్టు 16 మధ్య తయారైన డిజైర్‌ కార్లను వెనక్కి పిలుస్తున్నట్లు వెల్లడించింది.

వీటిలో ఉచితంగానే ఎయిర్‌బ్యాగ్‌ కంట్రోల్‌ యూనిట్‌ను మారుస్తామని మారుతీ సుజుకీ తెలిపింది. ఈ లోపాన్ని సరిచేసే వరకు కార్లను నడపొద్దని సూచించింది. లోపాన్ని గుర్తించిన కార్ల యజమానులకు కంపెనీ వర్క్‌షాప్‌ల నుంచి సమాచారం అందుతుందని తెలిపింది. వినియోగదారులకు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘Imp Customer Info’ సెక్షన్‌లో కారు చాసిస్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయడం ద్వారా లోపం ఉన్న కార్ల జాబితాలో మీ డిజైర్‌ ఉందో లేదో చెక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని