Elon Musk: నా కొడుకు జీనియస్.. మస్క్ తల్లి కామెంట్
మస్క్ సాధిస్తున్న విజయాలు నచ్చిన వ్యక్తులే ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఆయన తల్లి మయే మస్క్ అన్నారు. మరోవైపు ట్విటర్ ప్రమోషన్ కోసం మస్క్ అబద్ధాలు చెబుతున్నారని మాజీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ కొనుగోలు తర్వాత మస్క్ నిర్ణయాలు ఖాతాదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్కు ఆయన తల్లి మయే మస్క్ అండగా నిలిచారు. మస్క్ తెలివైన వాడు, అతడిపై విమర్శలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. మస్క్ సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేనివారే అతడిపై విమర్శలు చేస్తున్నారని మయే అభిప్రాయపడ్డారు. ట్విటర్ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కంపెనీలోని సెక్యూరిటీ, ప్రైవసీ విభాగాల్లో పనిచేసే కీలక ఉద్యోగులతో కలిపి మొత్తం 50 శాతం మంది ఉద్యోగులను తొలగించడం, ఆ తర్వాత 8 డాలర్లు చెల్లించి ఎవరైనా తమ ఖాతాలకు బ్లూటిక్ పొందొచ్చని పేర్కొనడం వంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. దీంతో కొన్ని నకిలీ ఖాతాలు సైతం బ్లూటిక్ తీసుకుని తప్పుడు ట్వీట్లు చేయడంతో పలు కంపెనీలకు నష్టం వాటిల్లింది.
మస్క్ చెప్పేవన్నీ అబద్ధాలు.. ట్విటర్ మాజీ ఉద్యోగి ఆరోపణ
మరోవైపు ట్విటర్ ప్రమోషన్స్ గురించి మస్క్ చేసిన ట్వీట్పై నెటిజన్లతోపాటు, కంపెనీ మాజీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ట్విటర్ ద్వారా వెబ్సైట్లు/యాప్లకు క్లిక్స్ పెరుగుతున్నాయి. ఇంటర్నెట్లో ఇదే అతిపెద్ద క్లిక్ డ్రైవ్’’ అని మస్క్ట్వీట్ చేశారు. దీనిపై ట్విటర్ మాజీ ఉద్యోగి సహా పలువురు నెటిజన్లు స్పందించారు. ‘‘మస్క్ చెప్పేవన్నీ అబద్ధాలే, ఈ విషయం ట్విటర్ యజమాన్యానికి కూడా తెలుసు. నేను ఐదేళ్లపాటు ట్విటర్లో పనిచేశాను. మస్క్ చెప్పేది వందశాతం అబద్ధం. ట్విటర్ ఎప్పుడు క్లిక్స్ను అమ్ముకోదు. ఎందుకంటే ఫేస్బుక్, లింక్డ్ఇన్ కంటే ట్విటర్కు ట్రాఫిక్ తక్కువే. ట్విటర్కు వేరే బలాలున్నాయి. క్లిక్స్ కంటే మార్కెటింగ్ ముఖ్యం’’ అని ట్వీట్ చేశారు. మరో నెటిజన్ ట్వీట్ చేస్తూ మార్కెటింగ్ పరంగా ట్విటర్ గొప్ప టూల్ ఏమీ కాదని అన్నారు.
ట్విటర్ను లాభాల్లోకి తీసుకురావాలని మస్క్ తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సబ్స్క్రిప్షన్ ద్వారా లాభాలు పొందాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఉద్యోగులకు రాసిన లేఖలో క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది కష్టపడి పనిచేయాలని.. కంపెనీ ఇచ్చే చిన్న చిన్న ప్రయోజనాలను సైతం వదులుకునేందుకు సిద్ధపడాలని కోరినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ